ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. తాము హార్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు ఆ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పుపెడతామని
ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని స్ట్రాంగ్గా చెప్పింది. హార్ముజ్ జలసంధి గుండా ఉన్న మార్గం ఇంధనసరఫరాలో ప్రపంచానికి జీవనాడి వంటిది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదోవంతు రవాణా అవుతోంది.

