రఘురామకృష్టరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్నాయక్ తప్పక విచారణకు హాజరుకావాల్సిందేనంటూ హైకోర్టు ఆదేశించింది. ఫిర్యాదులో కానీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఐఆర్ లో కానీ తన పేరు లేదని తనకు ముందస్తు బెయిల్ ఇప్పించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులిస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్న వాదనలపై ఏకీభవించిన న్యాయస్థానం సునీల్నాయక్ విచారణకు హాజరుకావాల్సిందేనని తీర్పు ఇచ్చింది.

