నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ధాడింగ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడటంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.పొఖారా నుంచి కాఠ్మాండూ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. మృతుల్లో న్యూజిలాండ్కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో జపనీస్, డచ్ జాతీయురాలు ఉన్నట్లు చెప్పారు.

