ఏపీలోని గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త, దళితుడు మందా సాల్మన్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హింసారాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని, ఇలాంటి ఘటనలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

