రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్స్పై ఈసారి సిసి కెమెరాలు, ఫ్లైయింగ్ స్వాడ్ల బృందాల పర్యవేక్షణలో జరుగనున్నాయి. వచ్చే ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరంతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ఇంటర్ సైన్స్ గ్రూపులకు చెందిన దాదాపు 4 లక్షల మంది హాజరవుతారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తోంది.

