నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై వర్సిటీ విద్యార్థులు కేటీఆర్కు వినతిపత్రం అందజేశారు.బీఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న బ కేటీఆర్ను మార్గమధ్యంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాల్సిందిగా కోరారు.

