జోహన్నెస్బర్గ్ నగరానికి నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగారు గనుల ప్రాంతంలోని బెకర్స్డాల్లోని టావెర్న్పై (బార్) దాదాపు డజను మంది వ్యక్తులు దాడి చేశారు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించినట్టుగా తొలుత పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత మృతుల సంఖ్యను 9గా తెలిపారు. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. ఆఫ్రికా ఖండంలోని అత్యంత పారిశ్రామిక దేశమైన దక్షిణాఫ్రికా… వ్యవస్థీకృత నెట్వర్క్ల ద్వారా నడిచే నేరాలు, హింస సర్వసాధారణంగా మారింది.

