నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఎవరినీ సంప్రదించకుండానే ఈ పథకం స్వరూపాన్ని మార్చేశారని ఆరోపించారు. ఈ చర్య పేదల ప్రయోజనాలను విరుద్ధంగా ఉందన్నారు. ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాకుండా, పథకం ఉనికినే ప్రశ్నార్థకం చేసిందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం అంటే దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, కూలీలు, భూమిలేని నిరుపేదల ప్రయోజనాలపై దాడి చేయడమేనని సోనియా గాంధీ స్పష్టం చేశారు.

