తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి ఆమని శనివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకుని అధికారికంగా బీజేపీలో చేరారు. మీడియాతో మాట్లాడిన ఆమని.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. మోదీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. భారతీయులమని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. అని ఆమె వ్యాఖ్యానించారు.

