భారత ప్రధాని నరేంద్ర మోడీ తన నాలుగురోజులు మూడుదేశాల పర్యటనలో భాగంగా ఒమన్ లో పర్యటిస్తున్నారు. మస్కట్ లో భారత్-ఒమన్ వ్యాపార సదస్సులో మోడీ ప్రసంగించారు. మన సంబంధం విశ్వాసం అనే పునాదిపై నిర్మించబడింది. స్నేహం అనే బలంపై ముందుకు సాగింది. కాలక్రమేణా అది మరింత బలపడింది. నేడు మన దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్స రాలు పూర్తయ్యాయి. మన శతాబ్దాల వారసత్వాన్ని ఒక సుసంపన్నమైన భవిష్యత్తు వైపు తీసుకువెళ్లాలి’ అని మోడీ ఆకాంక్షించారు.

