దాదాపు వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయాలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై దృష్టి సారించిన కేంద్రం..ప్రయాణికులకు టిక్కెట్ డబ్బులను రీఫండ్ చేయాలని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సంస్థ ఇప్పటివరకూ రూ.610 కోట్లను రీఫండ్ చేసినట్టు పౌరవిమానయాన శాఖ తాజాగా వెల్లడించింది. సుమారు 3000 వేల వరకూ సూట్కేసులు, ఇతర లగేజీని కూడా తిరిగిచ్చినట్టు తెలిపింది

