రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రెండు రోజుల భారత పర్యటన కోసం న్యూఢిల్లీకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ అజెండాలో భాగంగా రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. పుతిన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఘన స్వాగతం పలికారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. భారతదేశ ప్రపంచ దౌత్యంలో కీలక పాత్ర పోషించిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా హాజరయ్యారు. ముందుగా రాజ్ఘాట్లో నివాళులు అర్పించిన పుతిన్, ప్రధాని మోదీతో ప్రతినిధి బృందం స్థాయి చర్చలకు హాజరయ్యారు.

