
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పిఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ ఆరిఫుల్లా హుస్సేనీ ఆహ్వానం అందించారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉర్సు మహోత్సవాలు నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని… ఈ ఉర్సు మహోత్సవాలకు తప్పనిసరిగా హజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు. ఉర్సు మహోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు. ఉర్సు మహోత్సవాలకు సహకారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.