ఆదివారం వీకెండ్ కావడంతో సేదతీరేందుకు పలువురు చీరాల బీచ్కు వచ్చారు. అక్కడ స్నానం చేస్తుండగా అలల తాకిడికి ఎనిమిది మంది సముద్రం లోపలికి కొట్టుకుపోయిరు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ముగ్గురిని రక్షించారు. మరో ఐదుగురు నీటిలో మునిగి మరణించారు. మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ప్రాణాలకు తెగించి నలుగురు యువకులను రక్షించారు.

