
హైదరాబాద్లో టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సులకు ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. అన్ని రకాల బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంచనున్నారు. నాలుగో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసులో మొదటి స్టేజికి రూ.5 పెంచనుండగా.. రెండో స్టేజి నుంచి రూ. 10 అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు.పెంచిన ఈ ధరలు సోమవారం 6వ తేదీ నుంచి నుంచి అమల్లోకి రానున్నాయి.