
వాయువ్య మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయుగుండం ఏర్పడింది. పూరీ తీరానికి దక్షిణ ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో, గోపాల్పూర్కు తూర్పు దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.