
కేంద్ర ప్రాంతం లద్దాఖ్కు రాష్ట్రహోదా కల్పించాలని, లద్దాఖ్ను భారత రాజ్యాంగం లోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో బుధవారం భారీ ఎత్తున చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనలను అడ్డుకునేందుకు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన భద్రతాబలగాలకు, ఆందోళన కారులకు మధ్య తలెత్తిన సంఘర్షణలు చివరకు కాల్పులకు దారి తీయడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 70 మంది తీవ్రంగా గాయపడ్డారు.