
గత 24 గంటలుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయంగా మారాయి. శుక్రవారం సాయంత్రం రాయచోటిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. స్కూల్ విద్యార్థులతో వస్తున్న ఒక ఆటో వర్షపు నీటిలో మునిగిపోయింది.దీంతో ఆటోలో ఉన్న విద్యార్థులు, ఆటో డ్రైవర్ కాపాడామని కేకలు వేశారు. నీటిలో చిక్కుకున్న ఆటలో ఉన్న ఆరుగురు విద్యార్థులను సురక్షితంగా కాపాడి పైకి తీసుకొచ్చారు. కానీ ప్రమాదవశాత్తు ఒక ఎనిమిదేళ్ల బాలిక వర్షపు నీటిలో కొట్టుకుపోయింది.