
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే వారు వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సొంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉందని కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. తమ రాజీనామా ఆమోదించకుండా మండలి చైర్మన్ తమను ఇరకాటంలో పెట్టారని పేర్కొన్నారు. రాజీనామా చేసి ఏడాది అయ్యిందని.. అయినప్పటికీ తమ రాజీనామా ఆమోదించలేదని కర్రి పద్మశ్రీ చెప్పారు.