
ఉల్లి ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చింది. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టార్కు రూ.50వేలు చెల్లించనున్నారు. ఉల్లి సాగు చేసిన రైతులందరికీ ఈ సాయం అందించనున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.రాష్ట్రంలో కుర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీగా ఉల్లి సాగు జరిగింది. రైతులు హెక్టార్కు ₹85,000 నుంచి ₹1.23 లక్షల వరకు పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు ధరలు రాలేదు.