ప్రపంచబాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు మరో స్వర్ణ పతాకం లభించింది. 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా బంగారు పతకం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో కజికిస్థాన్కు చెందిన నాజిమ్ కైజైబేపై 4-1 స్ల్పిట్ డెషిషన్తో మీనాక్షి విజయం సాధించింది. కాగా, పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతాకం సాధించిన నాజిమ్కి భారత బాక్సర్ మీనాక్షి గట్టి పోటీ ఇచ్చింది. తొలి రౌండ్లో ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురిపించింది. దీంతో తొలి రౌండ్ను 4-1తో సొంతం చేసుకుంది.

