ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. మత పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ దంపతులు, వైఎస్సార్ అర్ధాంగి విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

