దశాబ్దాలుగా భారత్ అమెరికాకు భారీగా సరుకులు అమ్ముతున్నా, అమెరికా నుంచి దిగుమతులు తక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా ఒకవైపు వాణిజ్యం అని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను భారత్ విధిస్తోందని ట్రంప్ విమర్శించారు. ఈ పరిస్థితుల్లో అమెరికా కంపెనీలు భారత మార్కెట్లో నిలబడలేకపోతున్నాయని అన్నారు. భారత్లో వ్యాపారం చేయడం చాలా కష్టతరమైందని ఆయన వ్యాఖ్యానించారు.

