దేశం మొత్తం 79వ ఇండిపెండెన్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సినీతారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కూతురు క్లింకారతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేశారు. మరోవైపు తన ఛారిటబుల్ ట్రస్టులో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి మువ్వన్నెలా జెండా ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

