మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అమరావతి ప్రాజెక్టులో భారీగా కమిషన్ దందా జరుగుతోందని ఆరోపించారు. ఒక సాధారణ భవనం నిర్మాణానికి హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి నగరాలలో చదరపు అడుగుకు రూ.4,000 నుండి రూ.5,000 ఖర్చవుతుందని, కానీ అమరావతిలో అది రూ.10,000లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంలో ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ‘మొబిలైజేషన్ అడ్వాన్స్’ పేరుతో గుత్తేదారులకు 10 శాతం అడ్వాన్స్ ఇచ్చి, అందులో నుంచి 8 శాతం తిరిగి వెనక్కి తీసుకుంటున్నారని ఆయన తెలిపారు.

