
తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఓ మంత్రి వణికిపోతున్నాడని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మంత్రులు తన కుర్చీ లాక్కుంటారని సిఎం రేవంత్ కు భయం పట్టుకుందని అన్నారు. ఓ మంత్రి ఫోన్ మార్చేసి డబ్బా ఫోన్ వాడుతున్నాడని విమర్శించారు. బిజెపి వచ్చి బిఆర్ఎస్ లో విలీనం అవుతున్నా మాజీ సిఎం కెసిఆర్ ఒప్పుకోరని జగదీష్ రెడ్డి చెప్పారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చిన్న, పెద్ద బ్రోకర్లకు పదవులు ఇచ్చారని విమర్శించారు.