ఆంధ్రా లిక్కర్ స్కాంలో విచారణకు సీఐడీ ఇచ్చిన నోటీసులను విజయసాయిరెడ్డి లైట్ తీసుకున్నారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్మరాలు ఉన్నాయని తాను రాలేనని ఆయన సిట్ అధికారులకు సమాచారం పంపారు. తనకు కుదిరనప్పుడు వస్తానని.. వచ్చే ముందు సమాచారం ఇస్తానన్నారు. తాను రాలేనన్న సమాచారాన్ని విజయసాయిరెడ్డి శుక్రవారమే సిట్ అధికారులకు ఇచ్చారు. కానీ సిట్ అధికారులు అంగీకరించలేదు. విజయసాయిరెడ్డి మాత్రం రాలేదు. దాంతో సిట్ అధికారులు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

