మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనేనని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు , నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు

