ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏడు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. జపాన్లో 500 ఉద్యోగ నియామకాలకు టామ్ కామ్… టెర్న్.. రాజ్ గ్రూప్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.

