loader

యూసీసీ, లవ్ జిహాద్‌పై చట్టం.. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అసోం బీజేపీ

అసోంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ సైకియా తదితరులు మేనిఫెస్టో విడుదల చేశారు. సంకల్ప పాత్ర పేరుతో రూపొందిన ఈ మేనిఫెస్టోలో బంగ్లాదేశీయులను రాష్ట్రం నుంచి పంపించడంతోపాటు యూసీసీ చట్టంపై కూడా ప్రజలకు హామీ ఇచ్చింది. ఐదేళ్లలో అసోంను వరదల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటం. మొదటి రెండేళ్లలో వరదల నివారణ కోసం రూ.18,000 […]

నందిగామలో మాంసం విక్రయాలు బంద్.. ఎందుకంటే?

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలో డయేరియా వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. చందాపురంలో అనేక మంది అస్వస్థతకు గురికావడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. దీని నివారణలో భాగంగా ఏప్రిల్ 8 వరకు మాంసం అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిషేధం కేవలం మాంసం షాపులకే పరిమితం కాకుండా హోటళ్లు, కర్రీ పాయింట్లకు కూడా వర్తిస్తుంది. చికెన్, మటన్ తో పాటు చేపల విక్రయాలను కూడా […]

పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు..

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. హుజూరాబాద్‌లో జరిగిన మినీ సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన కేసులో మంగళవారం కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో బందోబస్తులో ఉన్న పోలీసుల విధులకు, ట్రాఫిక్‌కు అంతరాయం కౌశిక్ రెడ్డి కలిగించారని.. అంతేకాకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఐసిఎస్ ల సంఘం కూడా కౌశిక్ రెడ్డిపై […]

LDF గెలవాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు : రాహుల్‌ గాంధీ

భారత్‌- అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశ భవిష్యత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ తాకట్టు పెట్టారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆ ఒప్పందం వల్ల దేశ రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆక్షేపించారు. కేరళలోని కన్నూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, బీజేపీకి లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (LDF)కి మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. ఆ రెండింటితో కాంగ్రెస్‌ నేతృత్వంలోని UDF పోరాడుతోందని వెల్లడించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో LDF గెలవాలని […]

ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ

అసెంబ్లీ ఎన్నికల వేళ.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఆ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా దీన్ని పరిగణిస్తున్నారు.

నిరుద్యోగులకు అద్భుత అవకాశం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 300 ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 300 ఖాళీల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 మార్చి 30 నుంచి ప్రారంభమైంది. మొత్తం 300 ఖాళీలలో సెక్షన్ ఆఫీసర్లు 5, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1, కంప్యూటర్ ఆపరేటర్లు 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1, లైబ్రేరియన్ గ్రేడ్-II 1, యు.డి. స్టెనోగ్రాఫర్లు 7, అసిస్టెంట్లు 78, ఎగ్జామినర్లు 27, టైపిస్టులు 44, కాపీయిస్టులు 34, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 50 పోస్టులు ఉన్నాయి.

ముఖ్యమంత్రి కారులో ఫ్లయింగ్ స్క్వాడ్‌ తనిఖీలు!

తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు హీటెక్కాయి. వివిధ రాజకీయ పార్టీలు, నేతల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న నేతలపై ఎన్నికల అధికారుల నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం (మార్చి 31) తంజావూరు సమీపంలో డీఎంకే నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కారును ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. సీఎం స్టాలిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌లు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

శీతలామాతా ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి

బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలో మాఘ్రా గ్రామంలో చైత్రమాసం చివరి వారం కావడంతో శీతలా మాతా ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఒక్కసారిగా తోపులాట జరగడంతో ఎనిమిది భక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ప్రతి మంగళవారం ఇక్కడ రద్దీ ఉంటుందని, తాము దర్శనం కోసం వచ్చామని పాట్నా నుంచి వచ్చిన ఓ భక్తురాలు తెలిపింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగిందని వివరించింది. పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక […]

కర్నూల్ జిల్లాలో బాలికపై ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు అత్యాచారం..

కర్నూలు జిల్లాలో 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ఆటోలో స్కూల్‌కు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ మహేంద్ర,ట్రాక్టర్ డ్రైవర్ శివ కుమార్ ఆమెకు మాయమాటలు చెప్పి, బెదిరించి ఇద్దరు పలుమార్లు బాలికను బెదిరించి అత్యాచారం చేశారు. బాలిక ఒంట్లో నలతగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

అమెరికా-ఇరాన్ అణు యుద్ధ ముప్పు: ఐక్యరాజ్యసమితి ప్రతినిధి రాజీనామా

ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్ సఫా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అణు దాడులు చేసేందుకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ వినాశనానికి సాక్ష్యంగా ఉండలేకనే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఐక్యరాజ్యసమితిలోని కొందరు కీలక నేతలు కూడా ఈ దాడులకు మద్దతు ఇస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON