loader

కాంగ్రెస్‌, వామపక్షాలు.. అన్నింటినీ నాశనం చేస్తాయి: మోదీ

కాంగ్రెస్‌, వామపక్షాలు ఎక్కడ అధికారంలోకి వచ్చినా.. అన్నింటినీ నాశనం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేరళలోని పాలక్కడ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘బెంగాల్‌, త్రిపురలో వామపక్షాలు ఏం చేశాయో దేశమంతటికీ తెలుసు. కేరళ కూడా దుర్మార్గపు పథకాలతో నలిగిపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఏం చేసిందో కూడా అందరూ చూశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది.. ఇదీ కాంగ్రెస్‌ పాలన’’ అని మోదీ అన్నారు.

జాతీయ స్థాయిలో నిర్మల్ హవా.. రెండు స్కోచ్ అవార్డులు సొంతం..!

జాతీయ వేదికపై మరోసారి తెలంగాణ గర్వంగా నిలిచింది. నిర్మల్ జిల్లా తన ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ ఢిల్లీ వేదికగా రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులను సొంతం చేసుకుంది. ఆరోగ్య రంగంలో “అమ్మరక్షిత” కార్యక్రమం ద్వారా మాతృ మరణాలను గణనీయంగా తగ్గించడం గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, నిర్మల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపైన కొయ్య బొమ్మల పరిరక్షణకు తీసుకున్న చర్యలు, రెండు రంగాల్లో సాధించిన విజయాలతో నిర్మల్ జిల్లా జాతీయ స్థాయిలో నిలిచింది.

తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ ఏర్పడిన గొప్ప వ్యవస్థ అని TDP 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పార్టీ అధినేత  నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ స్థాపన నుండి ఇప్పటివరకు అనేక చారిత్రాత్మక విజయాలను సాధించామని ఆయన గుర్తుచేశారు. ఇకపై రాష్ట్రంలో ‘మూడు రాజధానుల’ విధానం ఉండదని, ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఎర్రగా మారిన ఆకాశం.. ఆస్ట్రేలియాలో అరుదైన ఘటన

ఆస్ట్రేలియాలో అరుదైన ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమైంది. కాకపోతే, ఇది చాలామందిని భయపెట్టింది కూడా. ఈ ఘటన శుక్రవారం ఆస్ట్రేలియాలోని డెన్‌హామ్ అనే టూరిస్ట్ పట్టణంతోపాటు షార్క్ బే, పిల్బారా ప్రాంతాల్లో జరిగింది. ఆకాశం పూర్తిగా రక్తపు ఎరుగు రంగులోకి మారిపోవడంతో ప్రతి దృశ్యం ఎర్రగానే కనిపించింది. నారెల్లె అనే ఉష్ణమండల సైక్లోన్ ప్రభావంతో ఇలా జరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. కాంతి వికిరణ చర్య ద్వారా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

రష్యా ఓడరేవుపై డ్రోన్‌లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌..!

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటి ఉస్త్-లుగా (Ust-luga) ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న ఈ పోర్టులోని గ్యాస్ టెర్మినల్‌పై జరిగిన దాడితో భారీగా మంటలు చెలరేగాయి. ఫలితంగా అక్కడి కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన సుదూర శ్రేణి డ్రోన్‌లు రష్యా గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని, నేరుగా గ్యాస్ నిల్వ ట్యాంకర్లను ఢీకొట్టాయి

అసెంబ్లీని కుదిపేసిన కౌశిక్‌రెడ్డి వివాదం.. సభ నుంచి BRS ఎమ్మెల్యేలు సస్పెండ్!

ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగాయి. సభలో పాలకవర్గం, వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టు సభగా సాగింది. సభలో BRS ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి వ్యవహారశైలిపై దుమారం చెలరేగింది. కడియం మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆరోపణలు చేసింది అధికార పక్షం. గన్‌తో కాల్చి పడేస్తానని కౌశిక్‌ చేయితో సైగలు చేశారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు అయితే దీనిపై స్పందించిన స్పీకర్ సభలో ఆందోళన చేసిన బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈరోజు, రేపు BRS […]

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ: జిల్లాలకు కొత్త కలెక్టర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేపట్టింది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా టి.నిశాంతి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా అభిషిక్త్ కిశోర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ, కాకినాడ జిల్లా కలెక్టర్‌గా హరేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు.

తెదేపా కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తెదేపా జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్,పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెదేపా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య ఘట్టాలతో వీడియోను ప్రదర్శించారు.ఎన్టీఆర్ బస్సు యాత్ర, విధాన నిర్ణయాలు, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను అందులో పొందుపరిచారు.

కాళేశ్వరం కేసుపై కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సభలో కేవలం సూచనలు ఇచ్చి పారిపోవడం బీజేపీ సభ్యులకు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణను ఇప్పటికే సిబిఐకి అప్పగించామని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

టీవీకే పార్టీ అభ్యర్థుల లిస్ట్ విడుదల..విజయ్..రెండు స్థానాల నుంచి బరిలోకి

తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారిన టీవీకే పార్టీ ఎన్నికల బరిలో నిలిచే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. విజయ్ దళపతి రెండు స్థానాల నుంచి బరిలో నిలుస్తున్నారు. విజయ్ ఎవరితోనూ పొత్తు లేకుండా పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. చెపాక్‌లో ఉప ముఖ్యమంత్రి, ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌పై పోటీ చేసేందుకు విజయ్ టీవీకేలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత సెల్వంను బరిలో దింపారు. TVK ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON