loader

గోదావరిలో దూకి తల్లి,బిడ్డ ఆత్మాహత్యా యత్నం.. కాపాడిన మత్స్యకారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఓ మహిళ తన చిన్నారితో సహా భద్రాచలం గోదావరి వంతెనపై నుంచి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు వారిని వెంటనే కాపాడారు.క్షేమంగా తల్లీబిడ్డను బయటకు తీసుకువచ్చి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా  అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడు, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి బుద్ధ భగవానుడి పవిత్ర ప్రతిమను బహూకరించారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో, సుమారు రూ. 11,200 కోట్ల మొత్తం పెట్టుబడితో విమానాశ్రయం మొదటి దశను అభివృద్ధి చేశారు

డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం

భారత కరెన్సీ రూపాయి శుక్రవారం చారిత్రక పతనాన్ని నమోదు చేసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 94.85 స్థాయికి పడిపోయి కొత్త ఆల్ టైమ్ కనిష్ఠాన్ని తాకింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఈ పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి సుమారు 0.9 శాతం నష్టంతో 94.81 వద్ద స్థిరపడింది. ఇది కూడా రూపాయి చరిత్రలోనే అత్యల్ప ముగింపు స్థాయి కావడం గమనార్హం.

మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే శివతాండవమే!: సీఎం రేవంత్‌

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన సంకల్పంలో ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. “ఈశ్వరుడి ఆశీర్వాదంతో మూసీ నది ప్రక్షాళన చేస్తాం. ఎవరైనా అడ్డుపడితే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుంది. మూసీ ఒడ్డున మసీదు, చర్చి, గురుద్వారా కూడా నిర్మిస్తాం. ఇది గొప్ప పర్యాటక కేంద్రంగా మారబోతోంది. మూసీ నదిలో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తాం” అని […]

మళ్లీ జగన్ లాంటోళ్లు వస్తే… అమరావతిపై షర్మిల

మళ్లీ ఏ జగన్ లాంటోళ్లు వస్తే అనే ముందుచూపు చంద్రబాబు నాయుడు విజన్ కు నిదర్శనం అని వైయస్ షర్మిల అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నారని అన్నారు. ఈ తీర్మానం పై ఆమె హర్షం వ్యక్తం చేశారు. మరి రాజధాని కోసం విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 94(3) కింద అమరావతి ఫండ్స్ అడిగేందుకు లేదా ? కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే అనే క్లాజ్ సెక్షన్ 94(3d) చదవలేదా ? అంటూ చంద్రబాబును […]

161 మందితో వైజాగ్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం.. గాలిలో ఉండగా, ఇంజన్ ఫెయిల్..!

విశాఖపట్నం నుంచి వస్తున్న ఇండిగో విమానంలో ఇంజన్ వైఫల్యం తలెత్తినట్లు సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో శనివారం పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ తోపాటు, విమానాశ్రయ అధికారులు తక్షణమే అత్యవసర నిబంధనలను అమలు చేశారు. విమానాశ్రయంలోని 28వ రన్‌వేను వెంటనే మూసివేశారు. చివరికి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

అమరావతి చట్టబద్ధతపై తీర్మానం.. సభలో ప్రవేశపెట్టిన సీఎం

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే.. తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఆమోదించాక కేంద్రానికి పంపనున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఏపీకి శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని సీఎం చంద్రబాబు సంకల్పించారని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదన్నారు. 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్కు నోటిఫికేషన్ , ఫిబ్రవరి నాటికి 34,400 ఎకరాలను 29 వేల మంది రైతులు […]

వరుణ్ తేజ్ కొత్త సినిమా షురూ: క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్

మెగా కుటుంబం నుంచి మరో ఆసక్తికరమైన ప్రాజెక్టు పట్టాలెక్కింది. అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా, చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాతగా సరికొత్త చిత్రం శనివారం (మార్చి 28) హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది.ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు తన ఆశీస్సులు అందజేశారు. నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ఈ […]

నేడు ఎర్త్ అవర్: గంట పాటు లైట్లు బంద్

పర్యావరణ పరిరక్షణ, భూతాపం (Global Warming) పట్ల అవగాహన కల్పించేందుకు నిర్వహించే ‘ఎర్త్ అవర్’ కార్యక్రమం నేడు (మార్చి 28న) జరగనుంది. ఈ సందర్భంగా రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అనవసరమైన విద్యుత్ దీపాలను మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను ఆర్పివేసి ఈ ప్రపంచవ్యాప్త ఉద్యమంలో భాగం కావాలని పర్యావరణ ప్రేమికులు పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ (WWF) 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో […]

శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని శాసనసభలో సీఎం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 5లోని సబ్‌సెక్షన్‌ 2లో ‘ఎట్‌ అమరావతి’ పదం చేర్చాలని తీర్మానం ప్రవేశపెట్టారు. అమరావతి చట్టబద్ధతకు అనుగుణంగా విభజన చట్టంలో సవరణ చేయాలని తీర్మానం చేయనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON