loader

రజత కాంతుల్లో ఒంటిమిట్ట.. బ్రహ్మోత్సవాల కోసం అద్భుత అలంకరణలు..!

ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్బంగా రజత కాంతుల్లో తళుక్కుమంటూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. పవిత్రమైన ఈ క్షేత్రం టిటిడి ఆధ్వర్యంలో చేపట్టిన అద్భుత విద్యుత్ అలంకరణలతో దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ దివ్య ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకు 24 ఎల్‌ఈడీ వీడియో డిస్‌ప్లే […]

మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్​ షాప్​ లు బంద్..

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం షాపులు ముసివేయాలని కమిషనర్లు విసి సజ్జనార్, రమేష్, అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, మిలట్రీ క్యాంటీన్లు, క్లబ్బులను మూసివేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అమరావతి అగ్నిప్రమాద కేసులో వాచ్‌మెన్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రాయపూడి సమీపంలో ఉన్న ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద సంభవించిన భారీ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు కారణమైనట్లు భావిస్తున్న అనుమానితుడు, వాచ్‌మెన్ రామ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనకు గల కారణాలపై పోలీసులు అతడిని విచారిస్తున్నారు. సాంకేతిక ఆధారాల సేకరించి ఈ చర్యలు తీసుకున్నారు.

ఈసారి ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు లేవు.. ఎందుకో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభోత్సవ వేడుకలను ఈసారి రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్ 4న ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల సమయంలో చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మృతుల పట్ల గౌరవం, వారి కుటుంబాల పట్ల సానుభూతిని ప్రకటిస్తూ.. ఎటువంటి వినోద కార్యక్రమాలు లేకుండా లీగ్‌ను ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది.

శ్రీరామనవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో 12 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

శ్రీరామనవమి సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. 12 గంటల పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. పోలీసులు వెల్లడించారు. ఈ శ్రీరామనవమి శోభాయాత్ర సీతారాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై.. కోఠిలోని హనుమాన్‌ వ్యాయామశాల వరకు సాగనుంది. ఈ నేపథ్యంలోనే సీతారాంబాగ్-కోఠి మార్గంలో వాహనాలు వెళ్లేందుకు అనుమతులు నిరాకరించనున్నారు.

‘మేము వీఐపీలం.. ఐపీఎల్ టికెట్ల కోసం క్యూలో నిల్చోవాలా’?

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సందడికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కొందరు బెదిరింపులకు దిగుతున్నారు. కర్నాటక ఎమ్మెల్యే తమకు ఐపీఎల్ టికెట్లు ఇవ్వాలని, మైదానంలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని రాష్ట్ర క్రికెట్ సంఘాన్ని ఆదేశించారు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌తో ఐపీఎల్ మొదలవ్వనుంది హుంగుండ్ శాసనసభ్యుడైన విజయానంద్ కషపనవర్ గురువారం కర్నాటక క్రికెట్ సంఘానికి టికెట్ల గురించి కొన్ని ఆదేశాలిచ్చారు.

సీరియస్‌గా అసెంబ్లీ జరుగుతుంటే ఆటలేంటి?.. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఎద్దేవా.!

అసెంబ్లీలో కీలకమైన అంశాలపై చర్చను పక్కన పెట్టేందుకే ప్రభుత్వం ఆటల పోటీలకు తెర తీస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ సర్కార్ సభను నడపలేకనే క్రీడా పోటీల ఎత్తుగడ వేసిందని ఆయన విమర్శించారు. ఇంత సీరియస్‌గా సభ జరుగుతున్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటీ?అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వద్ద ఎటువంటి సమాధానం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

విమానం గాల్లో ఉండగా సాంకేతిక లోపం.. లండన్‌ వెళ్లకుండా తిరిగొచ్చిన ఎయిరిండియా ఫ్లైట్‌

దేశ రాజధాని ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాల్లో వెళ్తుండగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో గురువారం మధ్యాహ్నం తిరిగి జాతీయ రాజధానికి చేరుకుంది. ఏఐ111 విమానం గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో టేకాఫ్ అయింది గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో అనుమానిత సాంకేతిక లోపాన్ని సిబ్బంది గుర్తించారు. దాంతో దాదాపు ఏడు గంటల ప్రయాణం తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు విమానాన్ని తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు

30 మంది బాలికలపై మూడేళ్లుగా అత్యాచారం.. బీజేపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్‌

బీజేపీ పాలిత గోవాలో బీజేపీ కార్పొరేటర్ సుశాంత్ నాయక్ కుమారుడైన 22 ఏళ్ల సోహమ్ దారుణాలు బయటపడ్డాయి. సుమారు 30 మంది బాలికలపై మూడేళ్లుగా అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలు రికార్డ్‌ చేసి వారిని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఆ యువకుడు ఈ వీడియోలను వారికి చూపించాడు.ఇది తెలుసుకుని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు. సోహమ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో […]

గ్యాస్ కష్టాల నుంచి రిలీఫ్.. విశాఖకు చేరుకున్న భారీ ఎల్పీజీ నౌక..

పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరతపై ఆందోళన నెలకున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా విశాఖవాసులకు ఊరట లభించింది. ‘BW బిర్చ్’ అనే భారీ ఎల్‌పీజీ ట్యాంకర్ విశాఖ నౌకాశ్రయానికి గురువారం చేరుకుంది. ఇందులో భారీ ఎత్తున వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గుజరాత్‌లోని వడినార్ పోర్టులో నందా దేవి నుంచి షిప్-టు-షిప్ బదిలీ ద్వారా ఎల్పీజీని బీడబ్ల్యూ బిర్చ్‌లో లోడ్ చేశారు.. బిర్చ్‌తో పాటు ‘ఎంటీ పెట్రాయిట్’ అనే ఆయిల్ ట్యాంకర్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON