loader

తమ డిమాండ్లకు ఓకే అంటేనే యుద్ధం ఆగుతుందని ప్రకటన..

ఇరాన్ ప్రధానంగా ఐదు డిమాండ్లు ఇవే :  1.అమెరికా మరియు ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు, హత్యలు తక్షణమే ఆగిపోవాలి. 2. ఇరాన్‌పై మళ్లీ ఎప్పుడూ ఇలాంటి సైనిక దాడులు జరగవని పటిష్టమైన అంతర్జాతీయ హామీ ఉండాలి. 3.యుద్ధం వల్ల ఇరాన్ ఆస్తిపాస్తులకు, ప్రాణాలకు జరిగిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ స్పష్టమైన పరిహారం చెల్లించాలి. 4.హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ చట్టపరమైన సార్వభౌమాధికారాన్ని అధికారికంగా గుర్తించాలి.5.కేవలం ఇరాన్‌తోనే కాకుండా ఈ ప్రాంతంలోని అన్ని ప్రతిఘటన సమూహాలపై దాడులు నిలిపివేయాలి.

అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. తమ డిమాండ్లకు ఓకే అంటేనే యుద్ధం ఆగుతుందని ప్రకటన..

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా పంపిన 15 అంశాల ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. తమ షరతులు నెరవేరే వరకు అమెరికాకు బిగ్ షాకులు ఇస్తూనే ఉంటామని శపథం చేసింది. ఇరాన్ సీనియర్ అధికారులు ప్రెస్ టీవీతో మాట్లాడుతూ..  అమెరికా తమను రెండుసార్లు మోసం చేసిందని ఆరోపించారు. వాషింగ్టన్‌కు శాంతి పట్ల నిజమైన ఉద్దేశం లేదని,  కేవలం తమ ప్రయోజనాల కోసమే ఈ ప్రతిపాదనలు చేస్తోందని […]

భక్తులకు శుభవార్త..ఏపీలో మూడుచోట్ల గిరి ప్రదక్షిణ మార్గాలు

విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలోని రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం రోజున పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని..కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గంలో రోడ్డు మంజూరు చేశామని.. త్వరలోనే దానిని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆలయాల అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ […]

ఘనంగా ఏయూ 91, 92వ స్నాతకోత్సవ వేడుకలు – ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్

ఆంధ్రా యూనివర్శిటీ ఎందరో గొప్ప వ్యక్తులను దేశానికి ఇచ్చిందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో 91వ, 92వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. బీచ్ రోడ్​లోని ఏయూ కన్వెన్షన్​లో నిర్వహించిన ఈ వేడుకలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ఛైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తల్లావజ్ఞుల పతంజలి శాస్త్రికి గౌరవ డాక్టరేట్లు జస్టిస్ అ

మహదేవ్ యాప్ కేసులో ఈడీ దూకుడు.. బుర్జ్ ఖలీఫాలోని ఫ్లాట్లు, దుబాయ్‌లో ఆస్తులు జప్తు

మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వ్యవహరిస్తున్నది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో పలు ఫ్లాట్లతో సహా 20 స్థిరాస్తులను జప్తు చేసింది. ఈడీ కొత్తగా అటాచ్‌ చేసిన ఆస్తులలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫాలోని పలు ఫ్లాట్లు, బిజినెస్ బే వాణిజ్య జిల్లా, ఎస్ఎల్ఎస్ హోటల్ ఉన్నాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలకు చెందిన […]

అంబులెన్సులు లేక ఆటోలోనే.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పరిస్థితి ఇలా..

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.మృతదేహాలను తరలించే అంబులెన్స్ వాహనాలు లేక, మృతదేహాన్ని ఆటోలో తరలించారు. చౌటుపల్లి గ్రామానికి చెందిన మహిళ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని చౌటుపల్లి గ్రామానికి తరలించాల్సి ఉంది. అయితే అంబులెన్సులు లేకపోవడంతో చేసేదేమి లేక మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆటోలో తరలించారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఎంజీఎంలో సౌకర్యాల పరిస్థితిని అద్దం పట్టేలా ఉన్న ఈ వీడియో నెట్టింట చక్కర్లు […]

దేశంలో 100 కొత్త ఎయిర్‌పోర్టులు.. కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు దేశంలో 100 కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిండానికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్టులతోపాటు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్స్‌ను కూడా కేంద్రం నిర్మించనుంది. 2026-2027 నుంచి 2035-2036 వరకు, పదేళ్లపాటు ఉడాన్ స్కీమ్‌ కింద వీటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీనికోసం రూ.28,840 కోట్లను కేంద్రం కేటాయించనుంది. దీని ద్వారా చిన్న పట్టణాలకు ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుందని కేంద్రం చెబుతోంది.

నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా

భారతదేశ ఇంధన భద్రత స్ధిరంగా ఉందని, అదనపు సరకుతో నౌకలు వస్తున్నాయని కేంద్ర అన్ని రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం సాయంత్రం పార్లమెంటు బిల్డింగ్‌లో అఖిల పక్ష సమావేశం జరిగింది. దేశంలో ఇంధన భద్రత స్థిరంగా, దేశ ఇంధన అవసరాలకు సరిపడా ఉందని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వివిధ దేశాలతో సంప్రదింపులు సాగిస్తున్నామని, నిరంతరాయ ఇంధన సరఫరాకు అన్ని ప్రయత్నాలు […]

కాండ్లా సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం..

కాండ్లా సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుజరాత్‌ రాష్ట్రం కచ్‌ జిల్లాలోని గాంధీధామ్‌ సిటీలోగల కాండ్లా సెజ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

శ్రీరామనవమి సందర్భంగా ఇంటి వద్దకే భద్రాచలం స్వామివారి కళ్యాణ తలంబ్రాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలను భక్తులకు ఇంటి వద్దకే అందించనుంది. భక్తులు ఆర్టీసీ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే డోర్ డెలివరీ చేయనుంది. టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవల ద్వారా ఈ సదుపాయం కల్పిస్తున్నామని, భక్తులు వినియోగించాలని అధికారులు స్పష్టం చేశారు. కేవలం రూ.151 చెల్లించి ఆర్డర్ పెట్టుకుంటే కళ్యాణ తలంబ్రాలను నేరుగా మీ ఇంటి వద్దకే తెచ్చి అందిస్తామని టీజీఎస్ఆర్టీసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON