loader

చేతులు మారిన రాజస్థాన్‌ రాయల్స్‌!

ఐపీఎల్లోని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీని అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 1.63 బిలియన్ డాలర్లతో (రూ.15 వేల కోట్లు) ఈ ఫ్రాంఛైజీని దక్కించుకున్నట్లు సమాచారం.

ఇకపై ప్రతి ఇంటికి కుళాయి – జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. దిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేసారు. పల్లెల్లో ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో జేజేఎం 2.0 ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, క్యాంప్ కార్యాలయం నుంచి జూమ్ ద్వారా సీఎం చంద్రబాబు, వర్చువల్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

ప‌శ్చిమాసియా ప‌రిస్థితి స‌మీక్ష‌పై రేపు అఖిల‌ప‌క్ష స‌మావేశం

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల అంశంపై స‌మీక్ష నిర్వ‌హించే నేప‌థ్యంలో బుధ‌వారం కేంద్ర ప్ర‌భుత్వం అఖిల ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ప‌శ్చిమాసియా అంశంపై పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగించిన విష‌యం తెలిసిందే.భార‌త్ వ‌ద్ద ప్ర‌స్తుతం 53 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల రిజ‌ర్వ్ ఇంధ‌నం ఉన్న‌ట్లు చెప్పారు. రాబోయే రోజుల ఆ సంఖ్య‌ను 65 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు చేర్చ‌నున్న‌ట్లు తెలిపారు. ఇంధ‌న నౌక‌ల త‌యారీ ప్రాజెక్టు కోసం సుమారు 70 వేల కోట్లు కేటాయించిన‌ట్లు […]

ఇరాన్ వార్ తో భారత్ కు కష్టాలే..! తేల్చేసిన ప్రధాని మోడీ..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్ కు ఆందోళనకరమేనని ఆయన తేల్చేశారు. కోవిడ్ ఎదుర్కొన్న తరహాలో పశ్చిమాసియా సంక్షోభాన్ని కూడా భారత్ అధిగమిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.ఇలాంటి సంక్షోభాల కోసం భారతదేశం తన ముడి చమురు,పెట్రోల్ , డీజిల్ నిల్వలను విస్తరించుకుందని ప్రధాని మోదీ తెలిపారు. నిరంతరాయ సరఫరాను సులభతరం చేయడానికి భారత్ వద్ద పుష్కలమైన ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రధాని వెల్లడించారు.

నిలిచిన రిజిస్ట్రేషన్లు.. సర్వర్ల మొరాయింపుతో వినియోగదారుల అవస్థలు!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు పెద్ద అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ప్రధాన సర్వర్లు సాంకేతిక కారణాలతో పనిచేయకపోవడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయాల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్తగా స్లాట్ బుక్ చేసుకోవడం మరియు చలాన్ల చెల్లింపులు వంటి ఆన్‌లైన్ సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా భూబదలాయింపు ప్రక్రియ కోసం వచ్చిన రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

హైదరాబాద్ లో పలు పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డులు

తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల ముందు ఆటోలు క్యూ కట్టాయి. పెట్రోల్, డీజిల్ కొరత దృష్ట్యా పెట్రోల్ బంక్‌లకు వాహనదారులు పోటెత్తారు. అత్తాపూర్, మల్లాపూర్, అంబర్ పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్, ఘట్ కేసర్, జిహెచ్ఎంసి పరిధిలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల దగ్గర ఆటోలు భారీగా క్యూ కట్టాయి. పలు పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.

2029 నుంచి ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు

దేశవ్యాప్తంగా లోక్‌సభ మరియు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీని ప్రకారం ఇరు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఆంధ్రప్రదేశ్ : అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఉన్న 175 నుండి 263కి పెరుగుతాయి.లోక్‌సభ స్థానాలు: ప్రస్తుతం ఉన్న 25 నుండి 38కి (అదనంగా 13 సీట్లు) పెరుగుతాయి. తెలంగాణ : అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం ఉన్న 119 నుండి 179కి పెరుగుతాయి. లోక్‌సభ స్థానాలు: ప్రస్తుతం ఉన్న […]

వికారాబాద్ జిల్లాలో సర్పంచ్‌ ఇంటికి నిప్పంటించిన దుండగుడు.. పలువురికి తీవ్ర గాయాలు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తాండాలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్ రమణి బాయి కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. అనార్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున ఇంటి పైకప్పు నుంచి నిప్పంటించడంతో సర్పంచ్‌తో పాటు ఆమె భర్త హన్మంత్ నాయక్, కుమారుడు వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.

పెన్షన్ బకాయిలు, పిఆర్సి పై బిఆర్ఎస్ వాకౌట్

తెలంగాణ శాసనసభలో ఉద్యోగుల, రిటైర్డు ఉద్యోగుల సమస్యలపై అధికార ప్రతిపక్షం మధ్యపరస్పర ఆరోపణలతో సభను వేడిక్కించడమేకాదు బిఆర్ఎస్ వాకౌట్ చేయడానికి దారి తీసింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పిఆర్సి, డిఎ బకాయిలు రిటైర్డు మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు విడుదల చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. పెన్షన్ బెనిఫిట్ అందక వైద్యసేవలు పొందలేక సుమారు 30 మంది ఉద్యోగులు మృతి చెందారని హరీష్ రావు విమర్శించారు.

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం పెంపుకు కేంద్రం కీలక నిర్ణయం

లోక్ సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది. సీట్ల పెంపు బిల్లు విషయమై ఇప్పటికే తమ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించిన కేంద్రం ప్రతిపక్షాలతో సైతం చర్చించాలని నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం మేరకు లోక్ సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816కి పెరగనుంది. దేశ వ్యాప్తంగా అసెంబ్లీల స్థానాల సంఖ్య 4,123 నుంచి 6,185 […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON