4 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఢిల్లీలో 9 మంది మృతి
ఢిల్లీలోని పాలెంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రామ్ చౌక్ మార్కెట్లో ఉన్న 4 అంతస్తుల భవనంలో ఉదయం 7 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భవనం బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్లో బట్టల దుకాణంతో పాటు కాస్మెటిక్స్ షోరూం కూడా ఉన్నది. అయితే బిల్డింగ్లోని టాప్ రెండు ఫోర్లలో ఆ ఇంటి యజమానులు ఉంటున్నారు.

