ఖర్గేతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ
ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గేతో చర్చించినట్టుగా సమాచారం. దీంతోపాటు పార్టీ పదవులు, తదితర అంశాల గురించి సిఎం రేవంత్రెడ్డి ఖర్గేతో మాట్లాడినట్టుగా తెలిసింది. ఏఐసిసి నూతన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

