loader

ఐపిఎల్-2026 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్ ఎవరి మధ్యంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026కి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ని ప్రకటించారు. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య బెంగళూరు వేదికగా జరుగనుంది. మార్చి 29న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. మూడు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత మిగితా షెడ్యూల్‌ని విడుదల చేస్తామని ఐపిఎల్ బోర్డు […]

గ్యాస్ డెలివరీ… ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు..

దేశంలో వంట గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఇదే పరిస్థితిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలు, మెసేజ్ యాప్స్ ద్వారా నకిలీ ప్రకటనలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. “తక్షణమే గ్యాస్ సిలిండర్ డెలివరీ”, వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులు పంపిస్తూ ముందుగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే వెంటనే సిలిండర్ పంపిస్తామని చెప్పడం గమనార్హం. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ […]

మానవత్వం చాటుకున్న సైనికులు: అమర జవాన్ కుమార్తె పెళ్లిలో కన్యాదానం చేసిన జవాన్లు

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో సైనికులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఒక అమర జవాను కుమార్తెకు పెళ్లి చేశారు. వారే స్వయంగా కన్యాదానం చేశారు. సైనికులంతా కలిసి ఆ పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిచారు. తోటి జవాన్ అమరుడైతే ఆ కుటుంబాన్ని కొండంత అండగా నిలవడంతోపాటు అతడి కూతురుకు పెళ్లి చేసి రూ.6 లక్షలకు పైగా కట్నకానుకలు ఇచ్చి నవ వధువును అత్తారింటికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బలగం’ హీరోయిన్‌తో కాలభైరవ పెళ్లి?

టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు, తన గాత్రంతోనూ, సంగీతంతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే, ఆయన పెళ్లాడబోయే అమ్మాయి మరెవరో కాదు… టాలీవుడ్ యువ నటి కావ్య కళ్యాణ్ రామ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం రెండు కుటుంబాల్లో వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ముహూర్తాలు ఖరారైన తర్వాత సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రభుత్వం పని చేసేది పేదల కోసం… సంపన్నుల కోసం కాదు: సీఎం 

జిల్లా కలెక్టర్ల సమావేశం సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం బిలియనీర్ల కోసం పని చేయడం లేదని.. పేదల కోసం పని చేస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ప్రతీ మూడు నెలలకూ పాలనా అంశాలపై సమీక్ష చేసుకుని ముందుకు వెళ్తున్నాం. వేట్లపాలెం బాణాసంచా పేలుళ్లు, శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనల్లో అధికార యంత్రాంగం అలక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెళ్లి చేసుకోబోతున్న కుంభమేళా మోనాలిసా..

ప్రయాగరాజ్ మహా కుంభమేళా పూసల దండలు అమ్ముకుంటూ.. రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెలబ్రిటీగా మారిన బ్యూటీ మోనాలిసా గత ఏడాదిన్నర కాలంగా కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే కుర్రాడిని ప్రేమిస్తుంది. వీరిద్దరికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. మతాలు, ప్రాంతాలు వేరు కావడంతో మెనాలిసా కుటుంబం వీళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. మోనాలిసా తండ్రి.. సినిమా షూటింగ్‌కు వచ్చి బలవంతంగా కూతురిని ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో మోనాలిసా తన ప్రియుడితో కలిసి రక్షణ కల్పించాలని […]

ఎమ్మార్వోపై అరెస్ట్ వారెంట్ జారీ.. మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు

నల్గొండ జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్‌పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీ) అరెస్ట్ వారెంట్ జారీ చేయడం.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భూ వివాదానికి సంబంధించిన కేసులో ఎమ్మార్వో సమగ్రంగా విచారణ జరిపి పూర్తి స్థాయి రిపోర్టును తమకు సమర్పించాలన్న కమిషన్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఎమ్మార్వోపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం […]

భారత్ కు బయల్దేరిన కార్గో నౌకను పేల్చేసిన ఇరాన్.. భారీ నష్టం..

హార్మూజ్ జలసంధి వద్ద థాయ్ లాండ్ కు చెందిన కార్గో నౌకను ఇరాన్ పేల్చేసింది. థాయ్ లాండ్ జెండాలు కలిగిన మయూరీ నారీ అనే కార్గో నౌక థాయ్ లాండ్ కు చెందిన ప్రీషియస్ షిప్పింగ్ పీసీఎల్ అనే సంస్థకు చెందినది. ఈ నౌక యూఏఈలోని ఖలీఫా పోర్టు నుంచి బయల్దేరింది. హార్మూజ్ జలసంధి గుండా ఈ నౌక గుజరాత్ లోని ఖండ్లా పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. దాడుల సమయంలో కార్గో నౌకలో 23 మంది నావికులలో […]

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అత్యంత శక్తివంతమైన మెరుపు దాడులకు దిగింది. దాదాపు ఒక టన్ను బరువున్న భారీ వార్‌హెడ్లతో కూడిన క్షిపణులను ఇరాన్ ప్రయోగించడంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడులతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సహా పలు ప్రధాన నగరాలు దద్దరిల్లాయి. ఈ బాంబు దాడుల ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి, విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది.

వెలుగుమట్ల వివాదం.. ఎక్కడ కూల్చారో అక్కడే వారికి ఇళ్లు

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం గత కొద్దిరోజులుగా పెను సంచలనంగా మారింది. పేదల ఇళ్లను కూల్చివేయడంపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం చివరకు దిగిరాక తప్పలేదు. ఎక్కడైతే ఇళ్లు కూల్చివేతకు గురయ్యాయో, సరిగ్గా అదే ప్రాంతంలో సుమారు 9 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి బాధితులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  311 మంది బాధితులకు ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున ఇంటి పట్టాలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON