loader

నీట్ యుజి దరఖాస్తు గడువు పెంపు

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2026) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం(మార్చి 8)తో దరఖాస్తు గడువు ముగియగా, దానిని ఈ నెల 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

యాసిడ్ దాడి బాధితుల జీవితాలను గౌరవంగా నిలబెట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ప్రతి బాధితుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యంకాకపోతే, వారి జీవనాధారం కోసం ప్రత్యేక భత్యం అందించే విధానం రూపొందించాలని కోర్టు ఆదేశించింది.ఇలాంటి దారుణాలకు పాల్పడే నేరగాళ్లకు మరింత కఠినమైన శిక్షలు విధించేలా చట్టాలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

కొత్త సవాళ్లను ఎదుర్కోవాలంటే పోలీసు అధికారులు అప్‌గ్రేడ్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

పోలీసు అకాడమీలో పోలీసు అధికారుల రీట్రీట్‌ కార్యక్రమంలో వివిధ అంశాలపై సీనియర్ పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. పోలీసింగ్​ను మరింత మెరుగుపర్చేందుకు వివిధ అంశాలపై, సాంకేతికత ఆధారంగా పెరుగుతున్న కొత్త తరహా నేరాల గురించి చర్చించారు. టెక్నాలజీలో మార్పుల వల్ల నేరాల స్వభావం కూడా మారిపోయిందని చెప్పారు, భౌతికంగా కనిపించని నేరాలను కనిపెట్టడం సవాళ్లతో కూడుకున్నదని, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలంటే పోలీసు అధికారులు అప్‌గ్రేడ్ కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఈశాన్య ప్రజలకు ఢిల్లీ సురక్షితం కాదు’.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ తపిర్ గావో సోమవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాతి వివక్షత చూపడంతోపాటు దాడుల సంఘటనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ‘ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ఈశాన్య ప్రాంతాల ప్రజలు జాతి వివక్ష, దాడులు, హత్యలను ఎదుర్కొంటున్నారు’ అని అన్నారు.

తెలంగాణ రైతుల సొమ్ముతో రాష్ట్రంలో ‘ రాహుల్ బంధు’ పథకం : కేటీఆర్‌ఎద్దేవా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ రాహుల్ బంధు’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రాహుల్ బంధు పథకాన్ని రైతులకు ఇచ్చే రైతుబంధు నిధులతో మొదలుపెట్టాడని విమర్శించారు. సంవత్సరానికి రూ. 1,000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు పథకం మాత్రం తెలంగాణలో పక్కాగా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి ఈసారి కూడా రైతుబంధును ఎగ్గొట్టాడని మండిపడ్డారు.

స్విస్ ఓపెన్ నుంచి సింధు ఔట్.. లక్ష్య సేన్ డౌటే..!

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు దూరమైంది. మూడు రోజుల తర్వాత స్వదేశం చేరుకున్న తెలుగు తేజం ఇంకా కుదురుకోలేదు. దాంతో.. వెంటనే కోర్టులోకి దిగేందుకు ఆమె సిద్ధంగా లేదు. సో.. స్విట్జర్‌లాండ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలని సింధు నిర్ణయించుకుంది. రెండోసారి కూడా ఆల్‌ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కంగుతిన్న లక్ష్య సేన్ సైతం ఈ పోటీల్లో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.

కొత్త సుప్రీం లీడర్ పట్ల విధేయత.. వేలాదిగా వీధుల్లోకి వచ్చి ప్రతిజ్ఞ..

కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీకి మద్దతుగా సోమవారం వేలాది మంది ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌లోని సెంట్రల్ స్క్వేర్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు.. కొత్త సుప్రీం లీడర్‌కు విధేయులమైన ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఇదే సమయంలో ఇరాన్‌పై విస్తృత దాడులు ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్- అమెరికా వైమానిక దాడుల నడుమే సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అసెంబ్లీ ఎక్స్‌పర్ట్స్ కౌన్సిల్ రహస్యంగా సమావేశమై.. మోజ్తాబాను పేరును ఖరారు చేసింది.

లోక్‌సభలో రూటు మార్చిన ప్రతిపక్షం..ఇరాన్‌ యుద్ధంపై చర్చకు పట్టు

రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చకు, ఓటింగ్‌కు పట్టుబట్టాల్సిన ప్రతిపక్షం రూట్ మార్చింది. ఉదయం సభ ప్రారంభం కాగానే గల్ఫ్‌ యుద్ధం, చమురు ధరలు, భారతీయుల తరలింపు వంటి అంశాల్ని లేవనెత్తింది. దీనిపై సభలో ప్రతిపక్ష సభ్యులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్ యుద్ధంపై, పెరుగుతున్న చమురు ధరలపై చర్చించాలని, అలాగే ఇరాన్ సహా గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించాలని కోరుతూ […]

ఇక ప్రభుత్వ సేవలన్నీ ఈ-ఆఫీస్‌లోనే.. వంత్ సర్కార్ నిర్ణయం

గవర్నమెంట్ ఆఫీసుల్లో కొండల్లా ఏళ్ల తరబడి మూలుగుతున్న ఫైళ్లకు క్లియరెన్స్ దక్కేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ-ఆఫీస్‌లోనే ప్రభుత్వ సేవలు అమలు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం.. అన్ని శాఖల అధికారులకు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా ఆర్థిక శాఖ కూడా ఈ-ఫైల్ విధానంలోని ఫైళ్లను మాత్రమే పరిశీలిస్తామని.. ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్ కాపీలను పరిగణించబోమని తాజాగా ప్రత్యేకంగా సర్క్యులర్ కూడా జారీ చేసింది.

పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. ఇద్దరు మృతి.. బస్సును తగలబెట్టిన స్థానికులు

ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో దారుణం జరిగింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (డీటీసీ)కి చెందిన బస్సు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న యువకుడిపైకి బస్సు ఎక్కడంతో అతడు అక్కడే మరణించాడు. అలాగే మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద ఘటనతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. బస్సు అద్దాల్ని ధ్వంసం చేశారు. బస్సుకు నిప్పు పెట్టారు. దీనిపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలు ఆర్పేశారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON