loader

ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల కోత 300 మందికి లేఆఫ్

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగుల కోతలు చర్చనీయాంశంగా మారాయి వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా సుమారు 250 నుంచి 300 మంది ఉద్యోగులను కంపెనీ విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ విషయంపై ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం స్పందిస్తూ ఉద్యోగుల పనితీరును క్రమం తప్పకుండా సమీక్షించడం సంస్థలో సాధారణ ప్రక్రియ అని తెలిపింది నిర్దేశిత ప్రమాణాలను అందుకోలేకపోయిన కొద్ది శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలగాల్సి వస్తుందని పేర్కొంది

రాజ్‌భవన్ రోడ్డులో వైన్ షాపులో అగ్నిప్రమాదం

నగరంలో నడిబొడ్డున రాజభవన్ రోడ్డులో ఓ వైన్ షాపులో అగ్ని ప్రమాదంలో జరిగింది. శనివారం తెల్లవారుజామున వైన్ షాపు నుంచి పొగలు రావడంతో వాకర్స్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వైన్ షాపు సిబ్బంది అక్కడికి చేరుకొని డోర్లు ఓపెన్ చేశారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. ఈ ప్రమాదంలో మద్యం బాటిళ్లు, సామాగ్రి దగ్ధమయ్యాయని, ఫ్రిజ్ లేదా వైరింగ్‌లో ఏర్పడిన షార్ట్ సర్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు

వార్ ఎఫెక్ట్ : భారీగా పెరిగిన వంట గ్యాస్‌ ధరలు

దేశంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయి. గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.60 పెంచింది. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే కమర్షియల్ 19 కిలోల సిలిండర్ ధరను రూ.114.5 పెంచింది. ఈ పెంచిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

4 వారాలపాటు న్యూస్‌ టీవీ రేటింగ్స్‌ నిలిపివేత

పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో న్యూస్‌ చానళ్లకు నాలుగు వారాల పాటు టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్స్‌(టీఆర్‌పీ) నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఘర్షణలకు సంబంధించి సంచలనాత్మక, కల్పిత రిపోర్టింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీచేస్తూ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించే వార్తా కథనాలను అనేక న్యూస్‌ చానళ్లు ప్రసారం చేస్తున్నట్లు తాము గమనించామని పేర్కొన్నది.

రమదాన్ మాసం 17 వ రోజు

రంజాన్, లేదా రమదాన్ ఇస్లామీయ చంద్రమాస పంచాంగంలో తొమ్మిదవ నెల.ఖురాన్ ప్రకారం రమదాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసం’ . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘ రోజా ‘ అని అంటారు. “సౌమ్” అని అరబ్బీ లో పిలుస్తారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON