loader

కొత్త దంపతులకు సీఎం రేవంత్ ఆశీస్సులు.. విజయ్-రష్మిక ఇంట్లో సందడి!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులను కలిశారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట నివాసానికి వెళ్లిన సీఎం, వారికి పుష్పగుచ్ఛం అందించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త దంపతులు రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కూడా సీఎం కాసేపు ముచ్చటించారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఇంటికి వెళ్లి ఆశీర్వదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు

సరికొత్త ’జనాభా నిర్వహణ విధానం’ ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం అందించాలని ప్రభు త్వం ప్రతిపాదించింది. మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ. 1,000 చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు.

లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా రాజీనామా!

కేంద్ర పాలిత ప్రాంతం లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కవీందర్ గుప్తా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన, అధికారికంగా ప్రకటించారు. లఢఖ్ మూడవ ఎల్జీగా 2025, జూలై 18న బాధ్యతలు చేపట్టిన ఆయన, కేవలం ఎనిమిది నెలల స్వల్ప కాలంలోనే పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

T20 World Cup 2026 ఫైనల్స్‌కు భారత్

ఇంగ్లాండ్‌పై టీం ఇండియా భారీ విక్టరీ సాధించింది. వరుసగా రెండోవసారి ఫైనల్స్‌కు వెళ్లిన భారత్… ఈ నెల 8న అహ్మదబాద్‌లో కీవిస్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. సంజు 89 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్, శివమ్ దూబే వరుసగా 39, 43 పరుగులతో విజృంభించి ఔటయ్యారు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) చేసిన పవర్-హిట్టింగ్ భారత్ 250 పరుగుల మార్కును దాటడానికి దోహదపడింది.

ఇంగ్లండ్‌పై భారత్ ఉత్కంఠ విజయం

టి20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.

ఇక దాచిపెట్టేది ఏమీ లేదు..మ్యాచింగ్ డ్రెస్ లో జంటగా పెళ్ళికి హాజరైన విజయ్, త్రిష

ిర్మాత కల్పాత్తి ఎస్. సురేశ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విజయ్, త్రిష జంటగా వచ్చారు. ఇద్దరూ ఒకే కారులో, మ్యాచింగ్ కలర్ దుస్తులు ధరించి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజీపైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, కాసేపు మాట్లాడి ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ జంట వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇద్దరినీ విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే, మరికొందరు […]

అసోంలో సుఖోయ్ యుద్ధ విమానం గల్లంతు.. రాడార్‌కు అందని సంకేతాలు

భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్‌ క్రాఫ్ట్ ఒకటి ఈశాన్య రాష్ట్రంలో ఆచూకీ లేకుండా పోయింది. అసోంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. జోర్హాట్ నుంచి ఎగిరిన ఈ యుద్ధ విమానం.. కాసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, మారుమాల ఓ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్టు తెలుస్తోంది. ఇక, ఫైటర్ జెట్ గల్లంతైనట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్‌ అధ్యక్షుడి ప్రధాని మోదీ ఫోన్‌..!

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై చర్చించారు. యుద్దాన్ని ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరు దేశాధినేతలు మంతనాలు జరిపారు. శాంతి, సుస్థిరత కోసం తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. యుద్దంపై ఇప్పటికే గల్ప్‌ దేశాధినేతలతోనూ ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఇరు దేశాల చర్చలు, దౌత్యానికి తిరిగి రావాల్సిన అవసరం గురించి చర్చించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 50 బాంబు బెదిరింపు మెయిల్స్.. 28 ఏళ్ల యువకుడు అరెస్ట్

వరుసగా నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 50కిగా బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు పోలీసులు తెలిపారు. స్కూల్స్, మెట్రో స్టేషన్లు, ముంబై స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సహా వివిధ సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీనిపై ముంబై, గుజరాత్‌ సహా పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌరవ్ విశ్వాస్ అనే 28 ఏళ్ల యువకుడు ఈ మెయిల్స్ పంపుతున్నట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ పోలీసుల […]

బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ రాజీనామా

బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను భారత రాష్ట్రపతికి పంపారు. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, సీవీ ఆనంద్ బోస్​ రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON