loader

రాజమండ్రిలో పెద్దపులి…. భయంతో వణికిపోయిన వాహనదారులు

 రాజమండ్రి ప్రాంతం తొర్రేడు పెద్దపులి కనిపించింది. దివాన్ చెరువు హైవే సమీపంలో నడిరోడ్డులో వాహనదారులకు పెద్దపులి కంటపడింది. దివాన్ చెరువు వాసులు భయంతో వణికిపోతున్నారు. రాజమండి ప్రాంతంలో పలు గ్రామంలో పెద్ద పుల్లిని అటవీ శాఖ అధికారులు పట్టుకోవాలని కోరుతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. పెద్దపులిని అతి త్వరంలో పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ఇండిగో- ఎయిరిండియా విమానాలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో- ఎయిర్ ఇండియా విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి ముంబైకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలు ముంబై నుండి కోయంబత్తూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలను ఢీకొన్నాయి. సంఘటన జరిగిన సమయంలో రెండు విమానాలలో ప్రయాణికులు ఉన్నారు. రెండు రెక్కలు స్వల్పంగా ఢీకొనడంతో విమానాల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్…సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించింది అని సీఎం అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షనిర్వహించారు. 2024 సెప్టెంబర్ లో ఎదుర్కొన్న రూ.486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి 2026 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.54 కోట్లు లాభం సాధించింది అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన రూ. 11 వేల కోట్ల సాయంతో విశాఖ స్టీల్ […]

మంచు మోహన్ బాబు, విష్ణులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు..

తిరుపతిలో చోటు చేసుకున్న విద్యార్థి సంఘాల కిడ్నాప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. SFI విద్యార్థి నాయకులు అక్బర్, వినోద్ కిడ్నాప్‌కు గురయ్యారన్న ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ కేసులో A-2గా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, A-3గా  మంచు విష్ణు, A-1గా మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) పీఆర్‌ఓ సతీశ్ పేర్లు చేర్చడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించి పీఆర్‌ఓ సతీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం […]

ఫ్రాన్స్‌లోని ఎక్స్ కార్యాలయాల్లో సోదాలు!

ఫ్రాన్స్‌‌లోని పలు ఎక్స్ కార్యాలయాల్లో మంగళవారం అధికారులు సోదాలు నిర్వహించారు. ఆల్గోరిథమ్‌లో మార్పులు, పిల్లల అసభ్య చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తి ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా అధికారులు ఎక్స్‌కు చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు చేశారు. గతేడాది జనవరిలోనే పారిస్ ప్రాసిక్యూషన్ సైబర్ క్రైమ్ విభాగం ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎక్స్‌ సంస్థపై దర్యాప్తు ప్రారంభించింది. ఎక్స్ కార్యకలాపాలు ఫ్రాన్స్ చట్టాలకు అనుగుణంగా ఉండాలన్నదే అభిమతమని పారిస్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది.

ట్రాక్టర్ బోల్తా.. నలుగురు రైతులు మృతి

జగిత్యాల జిల్లాలో మల్లాపూర్ మండలం మొగిలిపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న పదిహేను మంది రైతుల్లో నలుగురు రైతులు మృతి చెందారు. మిగిలిన రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

హన్మకొండ జూపార్క్‌లో తెల్లపులి మృతి

హన్మకొండ హంటర్ రోడ్డులోని జూలజికల్ పార్క్‌లో తెల్ల పులి(శరణ్) మంగళవారం తెల్లవారుజామున ఎక్లోజర్‌లో మృతి చెందింది. వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్‌తో తెల్ల పులి మృతి చెందినట్లు జూ అధికారులు వెల్లడించారు. శరణ్ అంతక్రియలు మంగళవారం చేసినట్లు జూ పార్క్ పర్యవేక్షణ అధికారి తెలిపారు. శరణ్‌ను హైదరాబాద్ జూ పార్క్ నుండి జులైలో తీసుకువచ్చామని అన్నారు. జూ పార్కులో పులి సంరక్షణ సరిగ్గా లేకనే అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తుంది. కానీ జూ అధికారులు సిబ్బంది మాత్రం అనారోగ్యంతో […]

వరంగల్‌ భద్రకాళి అమ్మవారిని సేవలో పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా

ఏపీ డిప్యూటీ సీఎం, తెలుగు అగ్ర నటుడు పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా వరంగల్​లో ప్రముఖ ఆలయంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి వెళ్లిన అన్నా లెజినోవాకు ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న సాదర స్వాగతం పలికారు. తొలుత ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్నపన మండపంలో ముఖ్యఅర్చకులు వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్‌ కుమార్‌ శర్మ మహదాశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి, […]

వైజాగ్ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు దొంగలను పట్టుకున్న రోబోకాప్

AI ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌తో పనిచేస్తున్న రైల్ రోబోకాప్ ASC అర్జున్ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రాత్రి సుమారు 8.10 గంటల సమయంలో ఒక అనుమానితుడిని గుర్తించింది. స్టేషన్‌లోకి ప్రవేశించిన వ్యక్తి ముఖచిత్రాన్ని ముందుగానే లోడ్ చేసిన నేరస్తుల డేటాబేస్‌తో సరిపోల్చి, వెంటనే ఈ సమాచారం విశాఖపట్నం RPF CCTV కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ రూపంలో చేర్చింది.. అప్రమత్తమైన సబ్ ఇన్‌స్పెక్టర్ బృందం తనిఖీలు చేసి హడప శివ (39), అతని అనుచరుడు జి. భంగారు […]

ఢిల్లీలో లోకేశ్ మిషన్, కేంద్రంతో కీలక నిధుల చర్చలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కీలక పర్యటనకు నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి నిధుల సమీకరణ, అభివృద్ధి ప్రాజెక్టుల వేగవంతం, కేంద్ర సహకారం వంటి అంశాలే ఈ పర్యటన ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఢిల్లీలో ఆయనకు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీలతో సమావేశమైన లోకేశ్, రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్య అంశాలపై చర్చించారు. రేపు పార్లమెంట్ భవన్లో పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON