loader

పెంగ్విన్​తో కలిసి గ్రీన్​లాండ్​ వెళ్తున్న ట్రంప్​- AI చిత్రాన్ని పోస్ట్ చేసిన వైట్​హౌస్​

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో ట్రంప్ ఏమాత్రం తగ్గట్లేదు. అమెరికాలో గ్రీన్‌లాండ్ భాగమైపోయిందంటూ ఇటీవలే ఏఐ ఫొటోలను విడుదల చేసిన ట్రంప్, తాజాగా మరో AI చిత్రంతో సోషల్ మీడియాలో హల్ చేశారు. శనివారం వైట్‌హౌస్ ఒక  ఏఐ జనరేటెడ్ ఫొటోను షేర్ చేసింది. యూఎస్ ప్రెసిడెంట్ ఒక పెంగ్విన్‌తో కలిసి గ్రీన్‌లాండ్ వైపు నడుస్తున్నట్లు ఉన్న ఆ చిత్రానికి ‘Embrace the penguin’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే గ్రీన్‌లాండ్ విషయంలో యూరప్​ అసహనంతో ఉండగా, […]

విదేశాలలో 70 మంది వాంటెడ్ లు

దేశంలో వాంటెడ్ అయిన పరారీ నేరస్తులు 70 మందికి పైగా విదేశాలలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024 25 సంవత్సరంలో వీరి ఆచూకిని కనుగొన్నట్లు అధికారిక నివేదికలో తెలిపారు. ఇక ఇదే సమయంలో ఇతర దేశాలకు చెందిన పరారీదార్లు 203 మంది వరకూ భారతదేశంలో ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్సనల్, ప్రజా సమస్యలు, పెన్షన్ల మంత్రిత్వశాఖ వెలువరించిన  నివేదికలో  స్పష్టం అయింది. వేరే దేశాలకు పారిపోయిన నేరస్తుల సంఖ్య పది సంవత్సరాల కాలంలో ఈసారి […]

ఆఫ్ఘనిస్తాన్‌లో మంచు తుఫాన్, భారీ వర్షాలు.. 61 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌ను ప్రకృతి వణికిస్తోంది. ఒక పక్క మంచు తుఫాన్, మరో పక్క భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా మూడు రోజుల వ్యవధిలోనే 61 మందికిపైగా మరణించారు.మృతుల్లో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఏఎన్డీఎమ్ఏ) శనివారం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు పడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

8 సంవత్సరాలుగా బదిలీలకు నోచుకొని ఎక్సైజ్ కానిస్టేబుళ్లు

8 సంవత్సరాలుగా సుమారుగా 2,700ల మంది కానిస్టేబుళ్లకు పదోన్నతులు, బదిలీలు లేకపోవడం, మరో 200ల మంది కానిస్టేబుళ్లను అప్‌గ్రేడేషన్ చేయకపోవడంతో తమ సమస్యను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక వారు సతమతమవుతున్నారు. దీంతోపాటు 2017లో అధికారులు బదిలీలు జరగ్గా, 2018లో కానిస్టేబుళ్ల బదిలీలు, 2022 ఏప్రిల్‌లో ఈఎస్‌లకు పదోన్నతి ఇచ్చి వారికి బదిలీలు, 2024లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 130 మందిని చేసిన బదిలీలు తప్ప ఇప్పటివరకు ఈ శాఖలో పూర్తిస్థాయి బదిలీలు, పదోన్నతులు జరగలేదని ఆ […]

గంజాయి గ్యాంగ్ దాడిలో లేడీ కానిస్టేబుల్​కు తీవ్రగాయాలు – ఒక కిడ్నీ తొలగించిన వైద్యులు

నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గంజాయి ముఠా దాడిలో గాయపడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితుల కారును ఆపే ప్రయత్నంలో తీవ్ర గాయాలపాలైన సౌమ్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రోడ్డుపై పడిపోగా కడుపులో తీవ్రగాయాలయ్యాయి. అధికారులు హుటాహుటిన ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు గాయమైన కిడ్నీని తొలగించారు.

నైనీ టెండర్ రద్దు చేశారంటే స్కాం జరిగినట్టే కదా..?

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఎన్ని సాకులు చెప్పినా బొగ్గు కుంభకోణం, అందులో సిఎం బావమరిది రింగ్‌మెన్ పాత్ర పోషించడం నిజం అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ఆరోపించారు. నైనీ టెండర్ రద్దు చేశారంటే.. స్కాం జరిగినట్టే కదా..? అని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంపై భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై హరీష్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, భట్టి విషయాలను […]

నాంపల్లిలో భారీగా ట్రాఫిక్.. ఇటువైపు రావోద్దంటూ పోలీసులు..

నగరంలోని నాంపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. అబిడ్స్‌, నాంపల్లి, ఎంజె మార్కెట్‌, ఏక్‌మినార్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాలను ఇతర మార్గాలకు మళ్లీస్తూ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎవరూ రావొద్దని పోలీసులు సూచించారు. ఎగ్జిబిషన్‌ పర్యటన వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు.

బొబ్బిలి పులుల గర్జన వినిపించి 269 ఏళ్లు..

ఆంధ్రదేశ చరిత్రలో శౌర్యానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బొబ్బిలి యుద్ధం జరిగి నేటికి సరిగ్గా 269 ఏళ్లు పూర్తయ్యాయి. 1757 జనవరి 24న సంభవించిన ఈ చారిత్రాత్మక ఘట్టం, కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు, అది బొబ్బిలి వీరుల పౌరుషానికి, దేశభక్తికి చిహ్నం.  బొబ్బిలి కోట పరిసరాల్లో ‘బొబ్బిలి పులి’ తాండ్ర పాపారాయుడి విగ్రహానికి బేబీ నాయనా పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజవంశీయులు, ప్రజలు సమూహంగా యుద్ధ స్తూపం వద్ద అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ […]

ఇండిగోపై చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. 700 కి పైగా విమానాలు రద్దు!

దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో, దేశీయ విమానాశ్రయాలలో 700 కి పైగా స్లాట్‌లను వదులుకుంది. భారత విమానయాన నియంత్రణ సంస్థ DGCA కఠినమైన చర్య తరువాత, ఎయిర్‌లైన్ తన శీతాకాలపు విమానాలను తగ్గించుకోవాలని ఆదేశించింది. గత సంవత్సరం డిసెంబర్ ప్రారంభంలో సంభవించిన భారీ అంతరాయం నేపథ్యంలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠినమైన చర్యలు తీసుకుంది. ఇండిగో శీతాకాల షెడ్యూల్‌ను 10 శాతం తగ్గించింది.

RDO వాహనాన్ని వేలం వేసి..డబ్బు ఆమెకు ఇవ్వాలని కోర్టు సంచలన తీర్పు

కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్గేయపురంలో 1988లో ప్రభుత్వం భూ యజమానుల నుంచి భూమిని సేకరించింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే భూమి యజమాని రామకృష్ణమ్మకు చెల్లించాల్సిన రూ.18,72,288 పరిహారం ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. ఆమె చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా పలుమార్లు ఆదేశించినప్పటికీ, అధికారుల నుంచి చలనం లేకపోవడంతో కోర్టు ఆర్డీవో వాహనాన్ని నెల 12న వేలం వేయాలని, వేలంలో వచ్చిన మొత్తాన్ని బాధితురాలికి చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON