loader

చేతిలో త్రిశూలం..నుదిటిపై తిలకం..సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనను శనివారం ఆధ్యాత్మిక క్షేత్రం సోమనాథ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభించారు. మన నాగరికత ధైర్యసాహసాలకు సోమనాథ్ ఒక అద్భుతమైన చిహ్నమని కొనియాడారు. 1026లో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొనడం తన అదృష్టమని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ సోమేశ్వర్ మహాదేవ్ మహా ఆరతిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని ఆపలేరు.. సీఎం చంద్రబాబు నాయుడు

సిద్దార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అమరావతిని ఎవరూ కదపలేరని, ‘కొందరి అసూయకు హద్దు లేకుండా పోతోంది. గత పాలనలో అమరావతిని ఆపేయాలని కుట్రలు చేస్తే ఏమయ్యారో చూశాం. అయినా బుద్ధి రాలేదు. అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ, చెన్నై, విశాఖ, నెల్లూరు, రాజమండ్రి ఎక్కడున్నాయో వారికి తెలియదా? ఎక్కడ నీరు ఉంటే అక్కడ నాగరికత అభివృద్ధి చెందుతుంది.’ […]

12న పిఎస్‌ఎల్వీ 62 రాకెట్ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 12న మరో ప్రతిష్ఠాత్మకమైన వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. ఏపీ లోని శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీసీ62 రాకెట్‌ను ఈ రాకెట్ ద్వారాడీఆర్‌డీవో రూపొందించిన ఈఓఎస్‌ఎన్ 1 శాటిలైట్‌ను 12 వ తేదీ ఉదయం 10.17 గంటలకు అంతరిక్షం లోకి పంపిస్తుంది. ఈ 9 వ వాణిజ్య మిషన్‌లో ప్రధాన ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఇవిఎస్ ఎన్1)తోపాటు దేశీయ, విదేశీ వినియోగదారులకు చెందిన 14 ఇతర ఉపగ్రహాలను కక్ష లోకి […]

గులాబీ రంగులో ఆకాశం.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండరు!

బ్రిటన్‌లో అక్కడి ఆకాశం అకస్మాత్తుగా గులాబీ రంగులోకి మారడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఫొటోలను తీసి నెట్టింట పంచుకున్నారు. బర్మింగ్‌హమ్‌లో ఈ అద్భుత దృశ్యం కనిపించింది అక్కడి సెయింట్ ఆండ్రూ స్టేడియంలో గులాబీ రంగు ఎల్‌ఈడీ లైట్‌లను ఏర్పాటు చేశారు. గాల్లోని మంచు కారణంగా ఈ వెలుతురు ఆకాశమంతా పరుచుకుని గులాబీ రంగులో మారినట్టు కనిపించింది. మంచు, మేఘాలు గులాబీ కాంతిని భూమి వైపు పంపించే అద్దాల్లాగా పనిచేశాయని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

జోహో ఫౌండర్ విడాకులు..రూ.15వేల కోట్ల వివాదం

జోహో ఫౌండర్.. టెక్ దిగ్గజం ‘శ్రీధర్ వెంబు’.. ఆయన భార్య ‘ప్రమీలా శ్రీనివాసన్’ కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. జోహో కంపెనీ షేర్స్ భార్య ప్రమీలా శ్రీనివాసన్ తెలియకుండా..రూ.15వేల కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు, బాండ్ల బదిలీ బంధువులకు బదిలీ చేశారనేది ఆరోపణ,.అమెరికా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. నేను బదిలీ చేసిన షేర్స్ అన్నీ.. చట్టబద్ధంగా జరిగినవే అని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాదం జోహో కంపెనీ ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది.

‘నేను కూడా డాక్టర్‌నే.. కానీ మీరనుకుంటున్నట్లు కాదు’.. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన అంతర్జాతీయ గుండె సంబంధిత పరిశోధన అండ్ శిక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కూడా ఒక డాక్టర్‌నే.. అయితే మీరు శరీరానికి చికిత్స చేసే వైద్యులైతే.. నేను సమాజంలోని రుగ్మతలను నయం చేసే సోషల్ డాక్టర్‌ను’ అని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే క్రమంలో తనను తాను సామాజిక వైద్యుడిగా […]

తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సై

తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకుజనసేన పార్టీ ఒక ప్రకటనవిడుదల చేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే పార్టీ కార్యచరణ ప్రారంభించింది అని ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలకు నెలరోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ…సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ తెలిపారు.

అయోధ్య రామాలయంలో నమాజ్‌కు యత్నించిన వ్యక్తి అరెస్ట్

అయోధ్య రామాలయ ప్రాంగణంలో శుక్రవారం నమాజ్ చేయడానికి ప్రయత్నించిన కశ్మీర్‌కు చెందిన అహ్మద్ షేక్ (55)ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని అదుపు లోకి తీసుకున్నారు. స్థానికులు,మీడియా కథనాల ప్రకారం అహ్మద్ షేక్ రామాలయ ప్రాంగణం లోని సీతారసోయి ప్రాంతంలో నమాజ్ చేయడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ అతడు దేవాలయం లోకి ఎలా ప్రవేశించాడు? అతడితోపాటు ఇంకెవరైనా ఉన్నారా ? అని ఆరా తీస్తున్నారు.

హార్వర్డ్ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్‌కు కెటిఆర్‌కు ఆహ్వానం

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కెటిఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, 23వ ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్‌లో ప్రసంగించాల్సిందిగా కెటిఆర్‌ను ఆహ్వానించారు. ‘ద ఇండియా వి ఇమాజిన్’ అనే థీమ్‌తో ఈ సదస్సు ఫిబ్రవరి 14, 15 తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ అమెరికాలో జరిగే అతిపెద్ద విద్యార్థుల కాన్ఫరెన్స్‌లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

‘ఎన్నికల సమయంలోనే ప్రతిపక్షాలపై ఈడీ దాడులు’.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కపిల్ సిబల్

ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేయడంపై స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికార పరిధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రివ్యూ పిటిషన్లను విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. పశ్చిమ బెంగాల్‌లో ఈడీ చర్య వెనుక ఏకైక ఉద్దేశం ప్రతిపక్ష నాయకులను వేధించడమేనని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్, బీహార్‌లో లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్‌లపై […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON