loader

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం భేటీ, చర్చించిన అంశాలివే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపుతో పాటు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చించారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

హిజ్బుల్లా నిరాయుధీకరణ: లెబనాన్ నిర్ణయానికి EU మద్దతు

లెబనాన్ ప్రభుత్వం తన దేశంలో హిజ్బుల్లా సైనిక కార్యకలాపాలను ముగించాలని తీసుకున్న నిర్ణయాన్ని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా స్వాగతించారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఇది ఒక కీలక అడుగు అని ఆయన అభివర్ణించారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌తో చర్చలు జరిపిన అనంతరం, కోస్టా సోషల్ మీడియా వేదికగా పలు కీలక అంశాలను వెల్లడించారు.

దుబాయ్ పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకుని బెంగళూరు చేరుకున్న పీవీ సింధు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆమె బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న స్థితి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో సింధు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, తనను కాపాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సత్యనారాయణ వ్రతంలో మాంసాహారం? విజ‌య్ దేవ‌ర‌కొండ‌ వేడుకపై నెటిజన్ల ఫైర్..

సాధారణంగా హిందూ సంప్రదాయాల ప్రకారం సత్యనారాయణ వ్రతం వంటి పవిత్ర పూజలు జరిగినప్పుడు కేవలం శాఖాహారం (వెజ్) మాత్రమే వడ్డిస్తారు. కానీ విజయ్ దేవరకొండ  గృహప్రవేశం  వేడుకలో వెజ్ మరియు నాన్-వెజ్ రెండింటినీ వడ్డించారు. దీంతో “పూజ ఉన్న రోజు మాంసాహారం పెట్టడం ఏమిటి? ఇది సంప్రదాయ విరుద్ధం” అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విమర్శలపై తెలంగాణ నెటిజన్లు గట్టిగా బదులిస్తున్నారు. హిందూ ధర్మంలో సంస్కృతి అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుందని, తెలంగాణలో ఇది మరింత […]

‘ఆ జలసంధిని మూసేశాం..దాటేందుకు ప్రయత్నించారో..’: ఇరాన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఇరాన్‌ తో ఇజ్రాయెల్‌, అమెరికా ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. తాము హార్ముజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు ఆ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పుపెడతామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని స్ట్రాంగ్‌గా చెప్పింది. హార్ముజ్‌ జలసంధి గుండా ఉన్న మార్గం ఇంధనసరఫరాలో ప్రపంచానికి జీవనాడి వంటిది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదోవంతు రవాణా […]

యూట్యూబ్‌లో ప్ర‌ధాని మోదీ రికార్డు.. 3 కోట్ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు

సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో ప్ర‌ధాని మోదీ రికార్డులు సృష్టిస్తున్నారు. యూట్యూబ్‌లో కీల‌క మైలురాయిని ఆయ‌న దాటేశారు. యూట్యూబ్‌లో ప్ర‌ధాని మోదీ ఛాన‌ల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసిన వారి సంఖ్య 3 కోట్లు దాటింది. అయితే ఈ ఫ్లాట్‌ఫామ్‌లో అత్య‌ధిక సంఖ్య‌లో ఫాలోవ‌ర్లు ఉన్న ప్ర‌పంచ నేత‌గా మోదీ రికార్డు సృష్టించారు. గ‌త వారం ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఘ‌న‌త సాధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ దేశాధినేత‌ల్లో అత్య‌ధిక సంఖ్య‌లో యూట్యూబ్ స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్న నేత‌గా ప్ర‌ధాని మోదీ నిలిచిన‌ట్లు […]

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై కేంద్ర ప్రభుత్వం మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. క్లిష్ట సమయంలో భారత్ స్పందించకపోవడం తటస్థత అనిపించుకోదని, అది నైతిక బాధ్యత నుంచి తప్పుకోవడమేనని ఆమె ధ్వజమెత్తారు. ఒక సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఆమె స్పష్టం చేశారు. “గల్ఫ్ దేశాలపై దాడులను ఖండించిన ప్రధాని మోదీ, ఇరాన్‌పై జరిగిన దాడిని ఎందుకు విస్మరిస్తున్నారు?” అని ఆమె […]

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం ఒక్కసారిగా పెరిగింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కర్నూలు వంటి ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అసాధారణంగా పొగమంచు కురుస్తోంది. పగలు ఎండ, తెల్లవారుజామున మంచు కురవడం వల్ల వాతావరణంలో అనిశ్చితి నెలకొంది.

అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్ లోని US consulate రోడ్ మూసివేత

అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, ముందస్తు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న అమెరికా కాన్సులేట్ వద్ద భద్రతను భారీగా పెంచారు. ఇందులో భాగంగా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. కాన్సులేట్ పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా, ఆ మార్గంలో వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధించారు.

హోలీ

హోలీ   అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ (“వసంతోత్సవ పండుగ”) అని అంటారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON