loader

ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై రష్యా బీభత్సం

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ దాడులు జరిపి దేశాన్ని చీకట్లోకి నెట్టింది. మంగళవారం రాత్రి రష్యా సైన్యం ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున క్షిపణులు మరియు డ్రోన్ల దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా అనేక పవర్ గ్రిడ్‌లు, విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాడుల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాజధాని కీవ్, అలాగే ల్వీవ్, ఒడెస్సా, జాపోరిజియా, రివ్నె, వోలిన్ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక […]

DA బకాయిల ఉత్తర్వులు సవరిస్తూ GO జారీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల DA విడుదలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన GO నంబర్ 60, 61 లలో మార్పులు చేసింది చంద్రబాబు సర్కారు. ప్రభుత్వ ఉద్యోగులకు నేటి నుంచి ఏడాది లోపు మూడు వాయిదాలలో DA బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ఉద్యోగుల GPF ఖాతాల్లో జమ చేయాలని GO లో సవరణలు తీసుకొచ్చారు. CPS ఉద్యోగులు, పెన్షనర్ లకు ఏడాది లోపు మూడు వాయిదాలలో చెల్లించాలని ఆదేశాలిచ్చారు. కొంచెంసేపటి క్రితం ఏపీ […]

సద్గురు అరెస్ట్ అంటూ ఫేక్ యాడ్స్.. ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు..

యూట్యూబ్‌లో సద్గురు, ఇషా ఫౌండేషన్ పేరుతో మోసపూరితమైన ఏఐ డీప్‌ఫేక్ యాడ్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నకిలీ ప్రకటనలను ఆపడానికి గూగుల్ తన వద్ద ఉన్న టెక్నాలజీని ఉపయోగించాలని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. సద్గురును అరెస్టు చేసినట్లు చూపించే తప్పుడు ప్రకటనలను వెంటనే ఆపాలని కోర్టు స్పష్టం చేసింది. ఇషా ఫౌండేషన్ పదేపదే ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు.. గూగుల్ – ఇషా ఫౌండేషన్ కలిసి కూర్చుని ఈ […]

ఓటింగ్‌లో దూసుకుపోతోన్న కల్యాణ్, తనూజ.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు

బిగ్ బాస్ 7 వారం నామినేషన్స్ హోరా హోరీగా సాగాయి. సోషల్ మీడియా లో నడుస్తోన్న ట్రెండ్స్ ప్రకారం ప్రస్తుతం ఓటింగ్‌లో కల్యాణ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక బిగ్ బాస్ బుట్ట బొమ్మ తనుజా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం టాప్ ప్లేస్ కోసం వీరిద్దరి మధ్య హోరా హోరీ ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం రాము, శ్రీనివాస సాయి డేంజర్ జోన్ లో ఓటింగ్ ట్రెండ్స్ కొనసాగితే మాత్రం రాము లేదా శ్రీనివాస సాయి […]

తెలంగాణలోని ఈ జిల్లాల్లో బ్యాంక్ ఉద్యోగాలు..

తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ ఏపెక్స్ బ్యాంక్ (TSCAB) 2025 నియామక నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 225 ఖాళీలు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (https://tgcab.bank.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఈ నియామకం ఐబిపిఎస్ ద్వారా ప్రత్యక్ష నియామక పద్ధతిలో జరుగుతుంది.

రేపట్నుంచి UAEలో చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సాధనకు రేపటి నుండి (అక్టోబర్ 22) మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE) పర్యటనలో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా దుబాయ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలతో కీలక భేటీలు, శోభా గ్రూప్‌, లోధా గ్రూప్‌, షరాఫ్‌ డీజీ, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల అధిపతులతో ఆయన సమావేశం కానున్నారు. అక్టోబర్ 24న అబుదాబిలో జరుగనున్న “తెలుగు డయాస్పోరా సదస్సు”లో కూడా చంద్రబాబు పాల్గొననున్నారు.

రేపు నెల్లూరు జిల్లా స్కూళ్లకు సెలవు

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మరోసారి ప్రతికూలంగా మారింది. రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరగనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నెల్లూరు జిల్లా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా రేపు (అక్టోబర్ 22) అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

శబరిమల మార్గంలో విరిగిపడ్డ కొండ చరియలు

శబరిమల మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమిలి నుంచి పంబ వైపు వెళ్లే రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే, తిరిగి వచ్చే భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా ఈ కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. వర్షాల ధాటికి ఈ ప్రాంతంలోని జలపాతాలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారిపై మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో వాహనాలు […]

మహిళ మెడలో పూలమాల – ఆరోగ్యం బాగుందా? అని తేజస్వీ కామెంట్​

​జేడీయూ అధినేత నితీశ్​ కుమార్, బీజేపీ అభ్యర్థి రమా నిషాద్‌ మెడలో పూలమాల వేశారు. పక్కనే ఉన్న రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా సీఎం చేయి పట్టుకుని ఆపినా ఆగకుండా ఆమె మెలలో పూలమాల వేశారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. దీంతో ఆర్​జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ స్పందించారు.​ ‘నితీశ్​ ఆరోగ్యం బాగుందా?’ అని ఎక్స్​లో కామెంట్​ చేశారు. మంగళవారం ముజఫర్‌పుర్ జిల్లాలోని మీనాపుర్ నియోజకవర్గంలో తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నితీశ్​ […]

దేశ చరిత్రలోనే తొలిసారిగా..! దీపావళి రోజున రూ.6.05లక్షల కోట్ల అమ్మకాలు..!

ఈ ఏడాది దేశవ్యాప్తంగా దీపావళి అమ్మకాలు రూ.6.05లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ.5.40 కోట్ల విలువైన వస్తువ వ్యాపారం.. రూ.65వేల కోట్ల విలువైన సర్వీసెస్‌ వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (CAIT) నివేదికను విడుదల చేసింది. ఇదే ఇప్పటి వరకు దేశ వాణిజ్య చరిత్రలో అతిపెద్ద పండుగగా నిలిచింది. దేశవ్యాప్తంగా 60 ప్రధాన కేంద్రాల్లో సీఏఐటీ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ నిర్వహించిన సర్వే ఆధారంగా ‘డిటైర్డ్‌ దీపావళి పండుగ అమ్మకాలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON