ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మరోసారి ప్రతికూలంగా మారింది. రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరగనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నెల్లూరు జిల్లా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా రేపు (అక్టోబర్ 22) అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

