loader

గద్దర్ అవార్డును మరో నంది అవార్డుగా మార్చేశారా- ప్రొఫెసర్ కంచ ఐలయ్య

గద్దర్ అవార్డుల ప్రెజెంటేషన్ సినిమా నటుల, రాజకీయ నాయకుల వ్యవహారంగా మారిందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. తెలంగాణ సంస్కృతిని భూస్వామ్య స్థితి నుంచి ప్రజాస్వామ్య రూపంలోకి మారడంలో గణనీయ పాత్ర పోషించి, ఆడి, పాడిన వందలాది మంది కళాకారులను, ప్రజా గాయకులను, పాటల రచయితలను తెలంగాణ ప్రభుత్వం మరచిపోవడం చాలా విచారకరమని ఆయనన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక బోధన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ NGO సంస్థలతో MOU కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​ సదుపాయాలను అందించనుంది ప్రభుత్వం. నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్ లాంటి పేరొందిన సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ MOU కుదుర్చుకుంది.

ఇంద్రాయణి నదిపై కూలిన వంతెన…. ఆరుగురు మృతి

మహారాష్ట్రలోని పుణేలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద ప్రమాదం జరిగింది. ఇంద్రాయని నదిపై నిర్మించిన వంతెన సగం కూలిపోయింది. వంతెన కూలిన సమయంలో చాలా మంది దాని మీద ఉన్నారు. దాంతో దాదాపు 25 నుంచి 30 మంది నదిలో పడి కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. పుణేలోని మావల్ లోని కుండ మాల్ లో ఇనుప వంతెన కూలిపోవడంతో కొంతమంది పర్యాటకులు నీటిలో పడి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

సైప్రస్‌ చేరుకున్న ప్రధాని మోదీ..

సైప్రస్‌ అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (జూన్ 15) లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ప్రధాని మోదీకి ఎయిర్‌ పోర్ట్‌లో సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ సైప్రియట్ నాయకత్వంతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు.వాణిజ్యం, సాంకేతికత, విద్య, సాంస్కృతిక మార్పిడిలో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తారు.

వినాయక విగ్రహం తరలిస్తుండగా కరెంట్ షాక్..

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం నెలకొంది. వినాయకచవితి సమీపిస్తున్నందున బాలాజీ వినాయక విగ్రహాల తయారి కేంద్రంలో భారీ గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. 13 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఒకచోటి నుంచి మరో చోటికి తరలిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి 8మంది కార్మికులకు షాక్ కొట్టింది. ఈదుర్ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు కరెంట్ షాక్ తగిలి అస్వస్థతకు గురయ్యారు.

అన్నదాత సుఖీభవ పథకం… ఈ – కేవైసీ చేయించుకున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్దమైంది. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే రైతులు ఈ – కేవైసీ పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. తొలి విడతలో రైతుల ఖాతాల్లో ఈ నెల 20న రూ. 7 వేలు జమ చేయనునున్నారు.

మేం రంగంలోకి దిగితే వార్ వన్ సైడే..ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్

అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ లు.. ఇజ్రాయేల్ కు మద్దతుగా రంగంలోకి దిగితే.. తీవ్ర పరిణామాలుంటాయని, ఆ దేశం సైనికస్థావరాలు, టార్గెట్ చేయాల్సి వస్తుందని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఒక వేళ తాము యుద్దంలో దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని ఇరాన్ కు హెచ్చరికలు జారీచేశారు. ఒకవేళ అమెరికాపై ఇరాన్ దాడికి పాల్పడే దుస్సాహాసమే చేస్తే.. చరిత్ర పుటల్లో కనివినీ ఎరుగని రీతిలో ఇరాన్ పై విరుచుకుపడతామని డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో […]

బాసరలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

గోదావరిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన నిర్మల్‌ జిల్లా బాసరలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ కు చెందిన ఓ కుటుంబం గోదావరిలో పుణ్యస్నానాల కోసం బాసరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు.. పుణ్యస్నానాలకు రాగా, వారిలో ఐదుగురు నీటిలో మునిగి మృతి చెందారు.

మహాత్మా గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష.. సౌతాఫ్రికాలో..

మహాత్మా గాంధీ మునిమనువరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్(56)కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది సౌతాఫ్రికా కోర్టు. ఇలా గాంధీ, దివంగత మెవా రామ్‌గోబిన్‌ల కుమార్తె అయిన లతా రామ్‌గోబిన్‌కు.. ఎస్‌ఆర్‌ మహరాజ్‌ అనే వ్యాపారవేత్తను 6 మిలియన్ రాండ్స్ (రూ. 3.22 కోట్లకు) మోసం చేసిన కేసులో ఈ శిక్ష పడింది. నేరం రుజువుకావడంతో కోర్టు శిక్ష ఖరారు చేస్తూ.. అప్పీలు చేసుకునే అవకాశాన్నీ నిరాకరించింది.

మెరిసిన గిరిజన తేజం.. తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా రికార్డ్..!

మారుమూల తండాలో పుట్టి, పెరిగిన గిరిజన బిడ్డ.. ప్రగతి రథం స్టీరింగ్‌ చేతపట్టి చరిత్ర సృష్టించింది. దేశంలోనూ, తెలంగాణలోనూ తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా రికార్డులకేక్కింది. ఇటీవలే ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ నుంచి తెలంగాణ ఆర్టీసీలో చేరింది. తొలిరోజు ఎంజీబీఎస్‌ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపి శభాష్ అనిపించుకుంది. 2015లో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ (డీటీసీ)లో బస్సు డ్రైవర్‌గా సరిత సెలక్ట్ అయ్యింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టులో సరిత ఒక్కరే మహిళా డ్రైవర్.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON