విద్యార్థిని హత్య ఘటన తీవ్రంగా కలచి వేసింది: లోకేష్
కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం విద్యార్థిని హత్య ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఈ ఘటనపై లోకేష్ స్పందించారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం తనను షాక్కు గురిచేసిందన్నారు. ఇంటర్ విద్యార్థిని హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు.