loader

విద్యార్థిని హత్య ఘటన తీవ్రంగా కలచి వేసింది: లోకేష్

కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం విద్యార్థిని హత్య ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఈ ఘటనపై లోకేష్ స్పందించారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఇంటర్ విద్యార్థిని హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

తొక్కిసలాట ఘటనలో..హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ

తమపైన పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. తమను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎస్‌ఎల్) తరఫు న్యాయవాది కోర్టు ఎదుట తమ వాదనలు విన్పించారు. ఆర్సీబీతో పాటు, డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా తమపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా హైకోర్టులో పి

ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత ఉందా?: జగన్

కూటమి ప్రభుత్వం వైఫల్యం దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉందని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 6 రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు.

కాళేశ్వరం కమిషన్‌కు ఆన్సర్లే కాదు, ఆధారాలు ఇచ్చిన హరీష్ రావు

కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను, ఆధారాలతో సమాధానాలను కాళేశ్వరం కమిషన్ చైర్మన్‌కు అందించానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కమిషన్ విచారణకు హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదని, జకీయాలు ఏమైనా ఉంటే రేపు మాట్లాడుతామన్నారు. అదే సమయంలో అన్ని నిజాలే చెప్పానని విచారణలో అడిగిన ప్రశ్నలు, సమాధానాలను హరీష్ రావు బి ఆర్ కే భవన్ మీడియా పాయింట్ వద్ద వివరించారు.

TGSRTC ప్రయాణికులకు బిగ్ షాక్..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో నెలవారీ బస్ పాస్ ధరలను భారీగా పెంచింది. ప్రస్తుతం రూ.1150 ఉన్న ఆర్డీనరీ బస్ పాస్ ధరను రూ.1400కు పెంచారు. ప్రస్తుతం రూ.1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ ధరను రూ.1600కు పెంచారు. రూ.1450గా ఉన్న మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర రూ.1800కు పెరిగింది. ఈ ధరల పెరుగుదలపై సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కదులుతున్న ట్రైన్‌ నుంచి పడిపోయిన 10 మంది ప్రయాణికులు

మహారాష్ట్రలోని ముంబ్రాలో సోమవారం (జూన్‌ 9) దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న లోకల్‌ రైలులో నుంచి 10 మందికి పైగా ప్రయాణికులు అమాంతం కింద పడిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. థానే జిల్లాలోని ముంబ్రా – దివా స్టేషన్ల మధ్య ఉదయం 10 గంటల ప్రాంతంలో రెండు రైళ్లు వ్యతిరేక దిశల్లో ఒకదానికొకటి దాటుతుండగా.. పుట్ బోర్డుపై వేలాడుతున్న పది మంది పట్టుతప్పి కింద పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు […]

అది ఈ జన్మలో జరగదు: కూతురిపై ముద్రగడ

నాకు వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవు. నేను పార్టీ కార్యక్రమాలకు హాజరగుతున్నాను. నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నాను. నన్ను బంధించి ఉంచడం కానీ మానసికంగా హింసించడం కానీ ఎవ్వరి తరం కాదు’అని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు.గతంలో నా భార్య విశ్రాంతి కోసం మీ ఇంటికి వస్తే ఇంటి నుండి బయటికి పంపిన సంగతి మీ ఇరువురూ మరిచిపోయారా? అంటూ కుమార్తె క్రాంతిని ఉద్దేశిస్తూ […]

లాస్ ఏంజెల్స్ లో ఉద్రిక్తం

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. వలసదారులపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తితో అక్కడి ప్రజలు రోడ్డెక్కి మూడోరోజు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. లాస్ ఏంజెల్స్ నగరంలో గత మూడు రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అమెరికాలో వలస అధికారులను అరెస్టులు చేయడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణం లాస్‌ ఏంజెల్స్‌ లో ఒక గొప్ప నగరమని, కానీ ఇప్పుడు అక్రమ వలసదారులు, నేరస్థులు దాన్ని ఆక్రమించారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌..

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొమ్మినేనిపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఏపీ పోలీసులు జర్నలిస్ట్ కొమ్మినేనిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఓ టీవీ ఛానెల్‌లో చర్చ సందర్భంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్‌ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఐపీఎల్ 2025తో బీసీసీఐ ఆదాయం.. ఎన్ని వేల కోట్లంటే?

ఐపీఎల్ నిర్వాహక బీసీసీఐ 20 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని పొందింది. ఐపీఎల్ నిర్వహణ ద్వారా బీసీసీఐకి అతిపెద్ద ఆదాయం ప్రసార రుసుములే. దీని ప్రకారం, బీసీసీఐ 2025 ఐపీఎల్ ప్రసార హక్కులను రూ.9678 కోట్లకు విక్రయించింది. అలాగే, ఒకే మ్యాచ్ నుంచి వచ్చే ఆదాయం దాదాపు రూ.130.7 కోట్లుగా చెబుతున్నారు. ఈ లీగ్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకోగా, డిజిటల్ హక్కులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని వయాకామ్ సొంతం చేసుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON