వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 24 మంది మరణించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్కుమార్, ఈగల్ ఐజీ రవికృష్ణ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రమాద ఘటనకు బాధ్యులను గుర్తించాలని జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. నెల రోజుల్లో నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించింది.

